రెపో రేటును మరోమారు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పెంచేసింది. కీలక రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ. ద్రవ్య పరపతి విధాన సమావేశంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వివరాలను వెల్లడించారు. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీలను రెపో రేటుగా పిలుస్తారు. రెపో రేటు పెంచడం అంటే, ఇక కమర్షియల్ బ్యాంకులు, లేదా వ్యక్తులకు రుణాలు తీసుకోవడం భారంగా మారుతుంది. 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో.. రెపో రేటు 5.4 శాతానికి చేరినట్లు శక్తికాంత్దాస్ వెల్లడించారు.
రెపో రేటును పెంచడం వరుసగా ఇది మూడవసారి. రోనా రాక ముందున్న 5.15 శాతాన్ని దాటిపోయింది. ద్రవ్యోల్బణాన్ని లక్ష్యిత పరిధిలో నియంత్రించేందుకు, అదే సమయంలో వృద్ధికి మద్దతునిస్తూ సర్దుబాటు వైఖరిని ఉపసంహరించుకోవడంపై దృష్టి సారించాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. ఈ కారణంగా రుణపరపతి కల్పన కోసం ఆర్బీఐ మద్దతుపై బ్యాంకులు శాశ్వతంగా ఆధారపడొద్దని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. తమ రుణ పరపతి లక్ష్యాల సాధన కోసం బ్యాంకులు మరిన్ని డిపాజిట్లు సేకరించాల్సిన అవసరం ఉందని శుక్రవారం మీడియాకు చెప్పారు.
బ్యాంకులు అధిక డిపాజిట్లు సేకరించినప్పుడు మాత్రమే రుణ పరపతి కల్పించడానికి నిలకడ లభిస్తుందన్నారు. బ్యాంకులు తమ సొంత ఆదాయ మార్గాల్లో నిధులు సమకూర్చుకోవాలని తెలిపారు. ఆర్బీఐ రెపోరేట్ పెంచుతుండగానే బ్యాంకులు తమ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచేస్తున్నాయని, ఈ ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నట్లు శక్తికాంతదాస్ అన్నారు. ఆర్బీఐ శుక్రవారం 50 బేసిక్ పాయింట్ల రెపోరేట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మే నెల నుంచి ఆర్బీఐ రెపోరేట్ పెంచడం ఇది మూడోసారి. తాజాగా 50 బేసిక్ పాయింట్లు పెంచడంతో ఆర్బీఐ రెపోరేట్ 5.40 శాతానికి చేరుకున్నది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more