విశాఖలో అధికార ప్రతినిధి అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నియోజకవర్గంలోని ఓ గ్రామానికి వెళ్లి అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు వివరించేందుకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను చూడగానే రంకెలేసిన మహిళలు మెడలోని కండువా పట్టుకుని దాడికి యత్నించారు. దుర్భాషలాడుతూ వెంబడించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు మధ్యలోకి వచ్చి వారిని దూరంగా జరిపారు. రంగంలోకి దిగిన పోలీసుల రక్షణ మధ్య ఆయన అక్కడి నుంచి బయటపడ్డారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం మాడగడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ గా మారాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ఎమ్మెల్యే మాడగడ గ్రామానికి చేరుకున్నారు. ఆయనను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు గిరిజన మహిళలు.. ‘‘చెప్పండీ సారు చెప్పండీ మా భూములను ఎందుకు ఆక్రమించుకున్నారు.?’’, ఈ లోగా మరో మహిళ ఎమ్మెల్యే మెడలోని కండువాను పట్టుకుని ‘‘మా భూములను కబ్జా చేసి మళ్లీ మా ఊరే వస్తావా?’’ అంటూ నిలదీసింది.
గిరిజనులందరూ గుమికూడి ఆయనపైకి ఎగబడి దాడికి యత్నించేందుకు ప్రయత్నించారు. అయితే పరిస్థితి చేయిదాటుతుందని భావించిన ఆయన వెంటనే అప్రమత్తమైన తన మెడలోని కండువాను పట్టుకున్న మహిళ చేతులను వెనక్కి నెట్టారు. ఈలోగా వైసీపీ కార్యకర్తలు మధ్యలోకి వచ్చి వారిని అక్కడి నుంచి వెనక్కి నెట్టివేశారు. ఈ క్రమంలో పోలీసులు కూడా రంగంలోకి దిగి వారిని అడ్డుకుని దూరంగా తీసుకెళ్లారు. అయినా శాంతించని గ్రామస్థులు భూములను కబ్జా చేస్తావా? అని దుర్భాషలాడుతూ వెంబడించారు. దీంతో చేసేది లేక పోలీసులు, వైసీపీ కార్యకర్తల రక్షణ మధ్య అక్కడి నుంచి ఆయన బయటపడ్డారు.
అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ స్పందించారు. తాను ఎలాంటి భూములను ఆక్రమించలేదని చెప్పుకచ్చారు. భూముల కబ్జా ఆరోపణలన్ని వారిని ప్రేరేపించి ఉపిగొల్పిన చర్యలేనని అన్నారు. తాను బ్యాంకు ఉద్యోగిగా ఉన్న సమయంలో 2012లో గోమంగి మధుసూదనరావు నుంచి సర్వే నంబరు 82లో ఉన్న 5.72 ఎకరాల పట్టాభూమిని కొనుగోలు చేసినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయన్నారు. అయితే, ఇప్పుడీ భూముల ధరలు పెరగడంతో కావాలనే తాను ఆ భూమిని కబ్జా చేసినట్టు ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కసుతోనే వారు తనపై అలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more