ప్రేమకు ప్రతిరూపంగా తల్లిని చెప్పుకుంటారు. అయితే అదే బిడ్డను దారిలో పెట్టాలంటే కూడా కొంత మనసు కఠినం చేసుకునే మందలిస్తారు. అయితే కొందరు తల్లలు మాత్రం అందుకు పూర్తి భిన్నం. మరీ కఠినంగా మారిపోయి.. తమ బిడ్డ తాము చెప్పినట్టే చేయాలని భావిస్తుంటారు. అలాంటి తల్లే ఒకరు ఢిల్లీలో దర్శనమిచ్చింది. తన ఎనమిదేళ్ల చిన్నారి కూతుర్ని అత్యంత దారుణంగా శిక్షించింది. ఈ వేసవిలో మండుటెండలో తమ పిల్లలు బయటకెళ్లి ఆడుకుంటేనే అల్లాడిపోయే తల్లుతున్న ఈ దేశంలో.. తన బిడ్డ చెప్పిన పని చేయలేదని కాళ్లు చేతులు కట్టేసి.. దారుణంగా మండుటెండలో ఇంటి మేడపై పడుకోబెట్టింది.
తల్లి వేసిన శిక్షను తట్టుకోలేకపోయిన ఆ చిన్నారి.. కొద్ది సేపటికి ఎండతో తన ఒళ్లు కాలిపోతుండటంతో బాగా గట్టిగా ఏడ్చేసింది. దీంతో ఇరుగుపోరుగు వారు ఎక్కడో బాలిక ఏడుస్తోందని గ్రహించారు. తీరా చూస్తే కాళ్లుచేతులు కట్టేసిన ఓ చిన్నారి ఎండకు తట్టుకోలేక ఏడుస్తుందని గ్రహించారు. ఈక్రమంలో కోందరు నెటిజనులు బాలిక ఏడుపును వీడియో తీసి తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారేు. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇక కోందరు ఆ తల్లి చేసిన నిర్వాకంపై పోలీసులకు పిర్యాదు చేశారు. అప్పటికే వీడియో కూడా వైరల్ కావడంతో దానిపై దృష్టి సారించిన పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఘటన కారవాల్ నగర్లో చోటు చేసుకుంది. అక్కడకు చేరుకున్న పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఆ తర్వాత ఘటన ఖజూర్ ఏరియా జరిగినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు ఇంటిని గుర్తించారు. చిన్నారి కుటుంబీకులను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే పోలీసులు విచారణలో తల్లి హోంవర్క్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా.. పెడచెవిన పెట్టి ఎండలో అడుతుందని అందుకనే ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు శిక్షించానని, ఆ తర్వాత బిడ్డను కిందకు దించాపపి చిన్నారి తల్లి వివరణ ఇచ్చిందని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more