పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగం సత్యానికి ఎంతో దూరంగా వుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం గురించి ఏమాత్రం మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో ప్రసంగించారు. తన ముత్తాత దేశ ప్రథమ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ నుంచి తన నాయినమ్మ ఇందిరాగాంధీ సహా తన తండ్రి రాజీవ్ గాంధీల విషయాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో దేశంలోని నిరుద్యోగం, చైనాతో పోంచివున్న ప్రమాదం, పెగసెస్ స్పైవేర్ తో దేశంలోని రాజీకీయ నేతలపై రహస్యంగా నిఘా పెట్టడం వంటి చర్యలపై ఆయన సుదీర్ఘంగా ప్రస్తావించారు. దేశం అంటే రాజ్యం, రాష్ట్రాలు సామంత రాజులు కాదని.. రాచరికపాలనకు దేశస్వతంత్ర్యంతోనే పోయిందని అన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో పదేళ్ల పాలనలో దేశంలోని 27 కోట్ల మందిని పేదలను పేదరికం నుంచి బయట పడేశామని, కానీ ఎన్డీయే హయాంలో ఈ ఏడేళ్ల కాలంలో 23 కోట్ల మందిని తిరిగి పేదరికంలోకి నెట్టేశారని తీవ్రంగా మండిపడ్డారు. గతేడాది మూడు కోట్ల మంది యువకులు దేశంలో ఉద్యోగాలను కోల్పోయారని, గత 50 ఏళ్లతో పోలిస్తే, నిరుద్యోగ సమస్య ప్రస్తుత కాలంలోనే అధికమైందని ఆయన మండిపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్రపతి ప్రసంగంలో లేనేలేవని ఎద్దేవా చేశారు. ఆ ప్రసంగానికి ఓ దృక్పథమంటూ లేదని రాహుల్ ఎద్దేవా చేశారు.
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు అభివృద్ధి పథంలో సాగకపోతే.. మేడిన్ ఇండియా అనేది కుదిరే పని కాదని రాహుల్ స్పష్టం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను విధ్వంసం చేసిందని, జీఎస్టీ, నోట్ల రద్దు ద్వారా వీటి పరిస్థితి దుర్భరమైందని విమర్శించారు. వీటికి చేయూత ఇవ్వడంలో మోదీ సర్కార్ విఫలమైందని రాహుల్ ఆరోపించారు. మోదీ హయాంలో భారతీయులు రెండు రకాలు విభజింపబడ్డారని, ఒకరు ధనవంతులు కాగా, మరొకరు పేదలని రాహుల్ అభివర్ణించారు. ఈ పేదలకు సరైన ఉద్యోగాలు కూడా లేవని అన్నారు. దేశానికి సంబంధించిన ధనమంతా ఒకరిద్దరి చేతుల్లోనే బందీ అయిపోయిందని, సంపన్నుల ఇండియా, పేదల ఇండియాగా మార్చేశారని రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. .
భారత్ రాష్ట్రాల సముదాయం.. రాజ్యం కాదు…
భారత్ అనేది పలు రాష్ట్రాల సముదాయమని, రాజ్యం మాత్రం కాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాలపై కేంద్రం ఎన్నటికీ పెత్తనం చెలాయించలేదని తేల్చి చెప్పారు. ఆయా రాష్ట్రాల ప్రజలు తమ దృక్పథంతోనే ఆలోచిస్తారని, ఇదే భారత దేశ బలమని పేర్కొన్నారు. అసలు ఎంత మంది ఉద్యోగాలిచ్చారన్న విషయమే కేంద్రం మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. ఎందుకంటే మీరు మాట్లాడితే అవి జోకులని ప్రజలు భావిస్తారని రాహుల్ సెటైర్ వేశారు. అత్యధిక ఉద్యోగులు అసంఘటిత రంగంలోనే ఉన్నాయని, ఆ రంగం నుంచే ధనికులకు కేంద్రం డబ్బులిచ్చిందని విమర్శించారు. ఇలా చేయడం ద్వారా అసంఘటిత రంగాన్ని కుదేలు చేసేశారని, పైగా.. జీఎస్టీ, నోట్ల రద్దు ద్వారా వారి గొంతు నొక్కేశారని రాహుల్ విమర్శించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షాపై కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ‘కొన్ని రోజుల క్రితం నన్ను కలవడానికి మణిపూర్ నుంచి ఓ నేత వచ్చారు. చాలా కోపంతో ఊగిపోయారు. నా పరువు ఎన్నడూ ఇంతలా పోలేదని ఆయన అన్నారు. ఏం జరిగిందని అడిగితే.. తాను కొన్ని రోజుల క్రితం అమిత్షా ఇంటికి వెళ్లారు. అయితే అక్కడి సిబ్బంది బూట్లు తీయమని తనను ఆదేశించారు. లోపలికి వెళితే మాత్రం అమిత్షా చెప్పులతోనే ఉన్నారు. చెప్పులతోనే తిరుగుతున్నారు. అమిత్షా మాత్రం ఇంటి లోపల చెప్పులతో తిరగవచ్చు… బయటి వ్యక్తులు మాత్రం బూట్లు తీసేసి లోపలికి వెళ్లాలా? ఇంతలా భేదభావం ఎందుకు చూపిస్తున్నారు? ఇదేం పద్ధతి?’ అంటూ రాహుల్ కేంద్ర హోంమంత్రి అమిత్షాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more