ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాలకు విస్తరించడం.. ఇక తొలిసారిగా వెలుగుచూసిన సౌతాఫ్రికాలో కాకవికళం చేసేలా 25 శాతానికి పాజిటివిటీ రేటు పెరగడం ప్రపంచదేశాలను తీవ్ర అందోళనకు గురిచేస్తోంది. కేవలం రెండు వారాల వ్యవధిలో రెండు శాతంగా వున్న పాజిటివిటీ రేటు ఏకంగా 25శాతానికి పెరగడంతో ప్రపంచదేశాలు హడలెత్తిపోతున్నాయి. రోజువారి కేసులు ఏకంగా పదివేలకు పైగానే నమోదువుతున్నాయి. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో నాలుగోదశ భీభత్సం కోనసాగుతోంది. దీంతో ఆ దేశం ప్రధానంగా వాక్సీనేషన్ పై దృష్టి సారించింది.
ఇదే సమయంలో అన్ని దేశాలు సంపూర్ణ వాక్సీనేషన్ పై దృష్టి సారించాయి. ఒమిక్రాన్ ను నియంత్రించడానికి ఇదొక్కటే తరుణోపాయమని ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఇప్పటివరకు కరోనా వాక్సీన్ తీసుకోనివారిని గుర్తించి వారికి తప్పనిసరిగా వ్యాక్సీన్ ఇవ్వాల్సిందిగా ఐఎంఏ సూచనలు చేసింది. ఇక ఒక్క డోసు తీసుకున్నవారికి కూడా నిర్ణీత సమయంలో మరో డోస్ వాక్సీన్ ఇవ్వాలని అదేశించింది. దీంతో పాటు 12 ఏళ్ల నుంచి 18ఏళ్ల మధ్యనున్న చిన్నారులకు కూడా వాక్సీన్ ఇవ్వాలని సూచించిన ఐఎంఏ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మరో డోస్ వాక్సీన్ ఇవ్వాలని సూచించింది. ఒమిక్రాన్ వేరియంట్ పేరు వినగానే ఇన్నాళ్లు వాక్సీన్ తీసుకోని వారు వెళ్లి వాక్సీన్ తీసుకుంటున్నారు.
గత కొన్నాళ్లుగా జనం లేక వెలవెలబోయిన వాక్సీనేషన్ కేంద్రాలు.. ఒమిక్రాన్ వేరియంట్ బీభత్సం సృష్టిస్తోందని తెలియడంతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం పరిధిలోని రేచింతల్ గ్రామంలో ఆరోగ్యశాఖ కార్యకర్తలు సంపూర్ణ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామంలోని ప్రజలందరికీ వాక్సీన్ ఇచ్చేందుకు వెళ్లారు. అయితే వారి జాబితాలో వున్న గౌసుద్దీన్ అనే ఓ యువకుడి పేరు వాక్సీన్ తీసుకోని వ్యక్తిగా నమోదై వుంది. దీంతో అతడికి వాక్సీన్ ఇచ్చేందుక అతని ఇంటికి వెళ్లిన ఆరోగ్య కార్యకర్తలకు చుక్కెదురైంది.
కరోనా వాక్సీన్ ఇచ్చేందుకు తమ ఇంటికి ఆరోగ్యకార్యకర్తలు వెళ్తున్నారన్న సమాచారం అందుకున్న గౌసుద్దీన్ సమీపంలోని ఓ చెట్టు ఎక్కి.. తనకు వాక్సీన్ తీసుకోనని భీష్మించాడు. దాదాపు గంట పాటు అతడ్ని చెట్టు దింపడానికి ఆరోగ్య కార్యకర్తలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో గ్రామంలోని పెద్దలు కూడా వచ్చి.. తాము కూడా వాక్సీన్ తీసుకున్నామని.. ఏమీ కాదని చెప్పి.. నచ్చజెప్పినా.. గౌసుద్దీన్ వాక్సీన్ తీసుకునేందుకు అంగీకరించలేదు. దీంతో ఏం చేయాలో తెలియక వారితో పాటు గ్రామపెద్దలు కూడా తలపట్టుకోగా.. గౌసుద్దీన్ తండ్రి సర్థార్ అలి టీకా వేసుకోవడంతో వారు వెనుదిరిగారు. గ్రామంలో వందశాతం వాక్సినేషన్ లక్ష్యంగా అరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి టీకాలు ఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more