తెలంగాణ ప్రాంత ప్రజలందరీ దృష్టి ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికలపైనే కేంద్రీకృతమైంది. బిసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పదవులలో కొనసాగడం ఇష్టం లేదని అందుకే తాను పార్టీ సభ్యత్వానికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన నేపథ్యంలో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ తమ మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా కొనసాగుతున్న ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డాంటూ కొందరు రైతులు అరోపించారని, అందకని ఆయనను మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ ఏడాది జూన్ 12న తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటినుంచి రాష్ట్రంలో హాటు రాజకీయాలకు హుజూరాబాద్ వేదికగా మారింది. ఒకవైపు ఈటెల.. మద్దుతుగా బీజేపి పార్టీ నేతలు, మరోవైపు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్ లో తిష్టవేసుకుని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఎన్నికలు ఎప్పుడా అని వేచిచూస్తున్న తరుణంలో కేంద్రఎన్నికల కమీషన్ ఇవాళ షెడ్యూల్డును విడుదల చేసింది. పార్లమెంటులోని లోక్ సభలో ఖాళీగా వున్న మూడు స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా వున్న 30 అసెంబ్లీ స్థానాలకు నగరాను మ్రోగించారు.
అక్టోబర్ 30న జరగనున్న హుజూరాబాద్ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నట్లు ప్రకటించింది. అయితే ఇక్కడే ఎన్నికల కమీషన్ ప్రచారపర్వంలో పలు అంక్షలను కూడా పెట్టింది. ఎన్నికల ప్రక్రియలో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ.. ఎన్నికల కమీషన్ విడుదల చేసిన నిబంధనలు పాటించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఎన్నికల కమీషన్ కోవిడ్ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టరిత్యా చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఎన్నికల నామినేషన్ పర్వానికి ముందుకానీ, తర్వాతకానీ ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా నియోజకవర్గంలో రోడ్ షోలు, బైక్, సైకిల్ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఇక అక్టోబర్ 30న ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో నియోజకవర్గంలో మూడు రోజుల ముందే (అంటే పోలింగ్ కు 72 గంటల ముందే) ఎన్నికల ప్రచారాన్ని పార్టీలు ముగించాలని అన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ సహా హన్మకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల ఉందని తెలిపారు. ఈవీఎంల తొలి దశ తనిఖీ పూర్తైందన్నారు. 305 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. హుజూరాబాద్ లో అందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అమల్లో ఉన్న పథకాలు, కార్యక్రమాలకు ఇబ్బంది ఉండదని తెలిపారు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే ఈసీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more