కృష్ణా జిల్లాలోని విజయవాడలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరువలోని ప్రకాశం బ్యారేజీ కింది ఇసుక దిబ్బల్లో ఓ ప్రేమ జంటపై దాడి చేసి.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడని కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గత 35 రోజులుగా పోలీసుల బృందాలకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నిందుతులలో ఒకడు చిక్కడంతో ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిపై అఘాయిత్యానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితుల్లో ఒకడిని పోలీసులు మారువేషాల్లో గాలించి పట్టుకున్నారు. ప్రస్తుతం అతడిని గుంటూరులోని ఓ పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నారు. ఈ ఏడాది జూన్లో సాయంత్రం వేళ గుంటూరు జిల్లా సీతానగరం ఇసుక దిబ్బల వద్దకు సేద దీరేందుకు ఓ యువ జంట వెళ్లింది. వీరిని చూసిన నిందితులు యువకుడిపై దాడి చేసి అతని షర్టుతోనే చేతులు కట్టేసి.. అతని కళ్లెదుటే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
నిందితులను వెంకటరెడ్డి, షేర్ కృష్ణగా గుర్తించిన పోలీసులు అప్పటి నుంచి వారి కోసం గాలిస్తూనే ఉన్నారు. వీరు ఫోన్ ఉపయోగించకపోవడంతో వారిని పట్టుకోవడం కష్టంగా మారింది. దీంతో పోలీసులు మారువేషాల్లో రంగంలోకి దిగారు. సమోసాలు అమ్మేవారిలా, ఫుడ్ డెలివరీ బాయ్స్ లా మారి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులకు గంజాయి తాగే అలవాటు ఉండడంతో అది తాగే ప్రదేశాల్లోనూ కాపుకాశారు. ఈ క్రమంలో నిందితుల్లో ఒకరు హైదరాబాదులో క్యాటరింగ్ పనులు చేస్తూ రైల్వేబ్రిడ్జి కింద ఉంటున్నాడని గుర్తించారు.
గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న పోలీసు ప్రత్యేక బృందాలు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నాయి. అయితే అరెస్ట్ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు అతడిని గుంటూరులోని ఓ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. మరో నిందితుడు చెన్నైలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసు బృందాలు అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులకు చిక్కింది షేర్ కృష్ణనా.. లేక వెంకట్ రెడ్డి అన్నదానిపిై కూడా ఇంకా స్పష్టత వెలువడలేదు. కాగా, విచారణ అనంతరం నిందితుడి అరెస్ట్ ను అధికారికంగా వెల్లడించనున్నట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more