రాజస్థాన్ లోని భరత్ పూర్లో నడిరోడ్డుపై పట్టపగలు అందరూ చూస్తుండగా కారులో వెళ్తున్న డాక్టర్ దంపతులను ఇద్దరు అగంతకులు అడ్డుకుని వారిపై కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన నిన్న సాయంత్రం చోటు చేసుకోగా పోలీసులు అగంతకులను గుర్తించారు. ఈ దారుణ ఘటనలో డాక్టర్ దంపతులు డాక్టర్ సుదీప్ గుప్తా, డాక్టర్ సీమ గుప్తాలు కారులో రక్తపు మడుగులో కుప్పకూలాపోయారు. వీరిపై అగంతకులు ఏకంగా ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.
2019లో ఇద్దరు డాక్టర్లు ఓ జంట హత్యల కేసులో అరెస్టు అయ్యిరు. ఇటీవలే వారు బెయిలుపై విడుదలైయ్యారు. ఈ నేపథ్యంలో వారు నిన్న కారులో వెళ్లుండగా, అప్పటికే కారును ఫాలో అవుతున్న అగంతకులు వెంబడించారు. సరిగ్గా స్పీడు బ్రేకర్ వద్ద కారు నెమ్మదించగానే దాని ముందుకు వచ్చి కారు వెళ్లకుండా బైక్ ను అడ్డుగా పెట్టిన అగంతకులు వారితో ఏదో పనిపై మాట్లేడేందుకు వచ్చినట్టుగా వచ్చిన దుండగులలో.. ఒక వ్యక్తి పక్కనే నిలబడి వుండగా మరో వ్యక్తి ముఖానికి రుమాలు చుట్టుకుని డాక్లర్ దంపతులపై కాల్పలు జరిపాడు.
ఆ సమయంలో మరో యువకుడు బైకుపైనే కూర్చున్నాడు. కాల్పులు జరిపిన యువకుడు ఆ వెంటనే బైకు ఎక్కగా, ఇద్దరూ కలసి అక్కడి నుంచి పారిపోయారు. కాగా 2019లో జరిగిన జంట హత్యల కేసులో డాక్టర్ దంపతులు అభియోగాలను ఎదుర్కోంటూ రెండేళ్లు పాటు వారు జుడీషియల్ రిమాండ్ లో వున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ సుదీప్ గుప్తా ఓ యువతితో వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకున్నారు. వారికి ఓ ఆరేళ్ల బాబు కూడా వున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన డాక్టర్ సీమా గుప్తా వారిని హత్య చేయించిందని అమెను పోలీసులు అరెస్టు చేశారు.
ఆ తరువాత ఈ కుట్రలో సుదీప్ గుప్తా పాత్ర కూడా ఉందని నిర్థారించుకున్న పోలీసులు ఆయనను కూడా అరెస్టు చేశారు. అయితే రెండేళ్లుగా జుడిషియల్ రిమాండ్ లో వున్న ఈ దంపతులు ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు. డాక్టర్ సుదీప్ తో వివాహేతర సంబంధమున్న యువతి హత్యకు ప్రతీకారంగానే ఈ డాక్టర్ దంపతులు హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువతి హత్యకు గురైంది. ఈ కేసులో డాక్టర్ భార్యతో పాటు ఆయన తల్లి కూడా నిందితులుగా ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more