కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో దేశంలోని మధ్యతరగతి వర్గాలు ఇక పేదల జాబితాలోకి చేరిపోనున్నారు. ఉన్నతవర్గాలను అందుకోవాలన్న వారి ఆశలు అడియాశలు కాగా.. కరోనాకు ముందు కరోనా తరువాత వారి అర్థిక పరిస్థితులు క్రమంగా దిగజారిపోతున్నాయి. అటు ఇంధన ధరలు పెరుగుతూ, ఇటు గ్యాస్ ధరలను పెంచుతూ సామాన్య మద్యతరగతి వారిపై కేంద్రంలోని సర్కార్ కొరఢా ఝుళిపిస్తోంది. దీంతో అన్ని కళ్ల ఎదుట కన్నబడుతున్నా.. ఏదీ కొనలేని, తినలేని దీనావస్థకు మధ్యతరగతి వర్గాలు చేరుకుంటున్నాయి.
తాజాగా వంట గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధరల పెంపు రూపంలో పేద, మధ్య తరగతి కుటుంబాలపై మరో గుదిబండ పడింది. సబ్సీడీ రహిత సిలిండర్ ధరను అందుకునేందుకు సబ్సీడి సిలిండర్ ధర చేరువవుతున్న క్రమంలో ఈ సారి సబ్సీడీ రహిత (వాణిజ్య) గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. ఇవాళ తాజాగా కేంద్రం అనుమతితో ఇంధన సంస్థలు వంటగ్యాస్ సిలిండర్ పై రూ.25, వాణిజ్య సిలిండర్ పై రూ.95ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. దీనిపై సామాన్యులు పెదవి విరుస్తున్నారు.
మూడు నెలల్లో రూ. 225 పెరిగిన సిలిండర్ ధర..
మూడు నెలల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర అమాంతం పెరిగింది. మూడు నెలల వ్యవధిలో అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల పేరుతో ఇంధన సంస్థలు గ్యాస్ ధరలను అమాంతం 225 రూపాయల మేర పెంచేసి.. గ్యాస్ వినియోగధారులపై భారాన్ని మొపుతున్నారు. డిసెంబర్ 1కి ముందు సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 594గా వుండింది. మరి తాజాగా పెంచిన ధరలతో గ్యాస్ ధర మార్చి 1 నాటికి ఢిల్లీలో రూ. 819కి చేరగా, అదే హైదరాబాద్ లో అయితే ఏకంగా 871.50కు చేరింది. దీంతో ఏడాది క్రితం గరిష్టానికి చేరింది.
గత ఏడాది డిసెంబర్ 1న దేశ రాజధాని ఢిల్లీలో సబ్సీడీ సిలిండర్ ధర రూ.594 ఉండగా, డిసెంబర్ ఒకటిన దానిని కేంద్రం రూ. 50 మేర పెంచుతూ.. రూ.644లుగా ఫిక్స్ చేసింది. ఆ తర్వాత జనవరి 1న రూ.644 నుంచి రూ.694కు పెంచగా... మరో రూ. 50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఫిబ్రవరి 4న ఇది రూ.719కి చేరింది. ఆ తర్వాత ఫిబ్రవరి 15న మరో రూ. 50 పెంచడంతో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 769కి చేరింది. ఆ తర్వాత ఇటీవల ఐదు రోజుల క్రితం రూ.25 మేర సిలిండర్ పై ధరను పెంచిన కేంద్రం.. తాజాగా ఇవాళ మరోమారు రూ.25 మేర పెంచింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో సబ్బీడీ సిలిండర్ ధర రూ.819కి చేరగా, హైదరాబాద్ లో రూ.871.50కు చేరుకుంది.
ఇక ప్రస్తుతం సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధర సబ్సీడీ యేతర గ్యాస్ సిలిండర్ ధరకు సమీపంచిన నేపథ్యంలో వాటిపై కూడా కేంద్రం తన మార్కును చూపించాయి ఇంధన సంస్థలు. దీంతో వాణిజ్య సిలిండర్ పైనా రూ.95 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో వాటి ధర రూ.1,614కు చేరింది. పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు సైతం రికార్డు స్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలలో 16 రోజులు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more