కరోనా మహమ్మారి మానవాళిపై సృష్టించిన కష్టకాలాన్ని పక్కనబెడితే.. దాని పేరుతో ఇప్పుడు దేశంలో ధరఘాతం మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఇంధన ధరలు సెంచరీ మార్కుకు చేరుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు శతకం మార్కుకు అత్యంత చేరువలో వున్నాయి. అదే సమయంలో వంటగ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవలే ఒక్కసారిగా భారీ కుదుపునిచ్చి.. పేదల పాలిట గుదిబండగా మారిన గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ మరోమారు రూ.25 మేర పెరిగింది.
వీటి ప్రభావంతో అటు నిత్యావసర సరుకుల ధరలకు కూడా రెక్కలు వచ్చేశాయి. ఇక ఇటు కూరగాయల ధరలతో బెంబేలెత్తిపోతున్నాయి. ఇదే తరుణంలో మరో పిడుగులాంటి వార్త సామాన్యుడి తలపై మరో పిడుగు పడేలా చేసింది. అదేటి అంటారా.. ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా వినియోగించే పాలుకు కూడా రెక్కలు రానున్నాయి. ఔనండీ ఇక ఇప్పుడు పాల ధరలు పెంచాలని మధ్యప్రదేశ్ రత్లాంలోని పాల ఉత్పత్తిదారులు నిర్ణయించారు. ఇదివరకు ఎన్నడూ లేనంతగా మార్చి1 నుంచి లీటర్ పాల ధరపై రూ.12ల చొప్పున పెంచాలని నిర్ణయించారు.
దీనిపై పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు హీరాలాల్ చౌదరి స్పిందిస్తూ.. ఇంధన ధరల ప్రభావం తమ పాడిపరిశ్రమపై చాలా అధికంగా పడిందిని.. దీంతో ధరలు పెంచక తప్పని పరిస్థితులు వచ్చాయని.. పాల ధరల పెంపుకు ఇంధన ధరలే కారణమని చెప్పుకోచ్చారు. ఈ క్రమంలో స్థానిక 25 గ్రామాలకు చెందిన పాల ఉత్పత్తిదారులం సమావేశమై.. పాల ధరలను పెంచాలని మేం డిమాండ్ చేస్తున్నామని అన్నారు. గతేడాది కూడా రూ.2లు పెంచాలని నిర్ణయించినా.. నగరంలోని సరఫరాదారులతో అంగీకారం కుదరకపోవడం.. దీనికితోడు కరోనా సంక్షోభం రావడంతో పెంచలేదని తెలిపారు.
ఇప్పుడు పెట్రోల్, డీజిల్లకు తోడుగా పశు దాణా ధరలు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పాల ధర రత్లాంలో రూ.43గా ఉంది. దాన్ని రూ.55లకు పెంచాలని నిర్ణయించాం. దీనిపై నగరంలోని పాల విక్రయదారులతో చర్చలు జరుపుతాం’’ అని వివరించారు. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టగా.. ఉల్లిధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దీంతో సామాన్యుడి బతుకు బండి భారంగా మారుతోంది. పిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతిఒక్కరూ తీసుకొనే పాల ధరలు పెరిగితే సామాన్యుడి జీవనం మరింత భారం కానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more