కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వున్న సుప్రసిద్ధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలల్లో భక్తులకు అనుమతి లేకుండా కేవలం అర్చక మహాశయులే మూలవిరాట్టుకు నిత్య కైంకర్యాలతో పాటు పూజలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు ఏడాది పోడుగునా తెరచి వుండే ఆలయాలకు మాత్రమే పరిమితం కాలేదు.. దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు ఇవి పరిమితం అయ్యాయి, ఇదే తరహాలో ప్రసిద్ధ ఆలయం శబరిమలలోనూ భక్తలు దర్శనంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి, మలయాళ నూతన సంవత్సరం విస్సు సందర్బంగా ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం మూసివేయబడిని శబరిమలలోని స్వామి ఆయ్యప్ప ఆలయం ఈ సారి మండల పూజ సందర్భంగా తెరుచుకున్నాయి.
ఇదే సమయంలో కేరళలో రెండోసారి కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కఠినమైన కరోనా నిబంధనల నడుమ 7 నెలల తర్వాత తెరుచుకున్న శబరిమల ఆలయ తలుపులు.. పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నాయి, ఇవాళ్టి నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తుండగా.. రోజుకు కేవలం 250 మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదివరకే కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. వారం ప్రారంభంలో 1000 మంది, వారాంతాల్లో 2 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. వర్చువల్ క్యూలో ద్వారా టికెట్లు పోందిన వారికి మాత్రమే దర్శనాన్ని అనుమతిస్తున్నారు, ఇవాళ దర్శనానికి కేవలం 246 మంది మాత్రమే నమోదు చేసుకోవడంతో అధికారులు దర్శనాల సంఖ్యను 250కి కుదించారు.
అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం పక్కా మార్గదర్శకాలను రూపొందించారు ఆలయ అధికారులు. దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాలని నిబంధన పెట్టారు. ధీంతో పాటు దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని షరతు కూడా విధించారు. వీరికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. స్వామివారికి నెలవారీ పూజలు ఐదురోజుల పాటు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్ 16 నుంచి అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో నెయ్యాభిషేకం, అన్నదానాలను రద్దుచేశారు. అలాగే 10 సంవత్సరాల లోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటిన వారిని దర్శనానికి అనుమతించడం లేదన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more