దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రాస్ దళిత యువతిపై సామూహిక అత్యాచారం ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందుతులకు మద్దతుగా బీజేపి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కూడా సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు బాధిత కుటుంబంపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతిచెందిన బాధిత యువతిని పోలీసులు అఘమేఘాల మీద ఎందుకు దహనం చేశారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎలాంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలకు పూనుకుంటున్నారు.
బాధితురాలి కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించడంతో పాటు వారి ఇంటి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు, ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రాస్ జిల్లాకు చెందిన బుల్గర్హి గ్రామంలోని బాధిత కుటుంబానికి భద్రతగా 60 మంది పోలీసులను ఏర్పాట్టు చేశారు, వీరిలో పలువురు మహిళా పోలీసులు కూడా వున్నారు. పోలీసుల కళ్లుగప్పి.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడాలని చూసేవారి కోసం నిఘా నేత్రాలను కూడా ఏర్పాటు చేశారు. బాధితురాలి ఇంటి చుట్టూర.. పరిసర ప్రాంతాలను కవర్ చేస్తూ ఎనిమిది సీసీటీవీ కెమెరాలను కూడా పోలీసులు ఏర్పాటు చేశామని తెలిపారు.
డీఐజీ షాలాభ్ మాథుర్ను లఖ్నవూ నుంచి హాథ్రస్కు నోడల్ అధికారిగా పంపారు. అవసరమైతే అక్కడ కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేయనున్నారు. మహిళా పోలీసులతో పాటు మొత్తం 60 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్టు హాథ్రస్ ఎస్పీ వినీత్ జైశ్వాల్ తెలిపారు. ఈ కేసులో బాధిత కుటుంబం, సాక్షులకు పోలీసులు భద్రతగా షిఫ్ట్ల్లో పనిచేస్తారని పేర్కొన్నారు. సీసీటీవీ కెమెరాలతో ఆ ఇంటిని నిరంతరం పర్యవేక్షిస్తామని ఎస్పీ తెలిపారు. అలాగే, ఆ ఇంటి వద్దకు వచ్చేవారికి సంబంధించిన ఓ రిజిస్టర్ను కూడా పెట్టినట్టు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more