కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం కారణంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రుణగ్రహీతలు వాటిని గత ఆరు మాసాలుగా వడ్డీ కట్టలేకపోవడంతో దానికి మారటోరియం తీసుకోవచ్చునని బ్యాంకులు ముందుగానే ప్రకటించాయి. అయితే మారటోరియం సమయంలోనూ చెల్లించని ఈఎంఐలపై వడ్డీ విధింపు విషయం రుణగ్రహీతలను అందోళనకు గురిచేస్తోంది. దీంతో ఈ విషయంలో కరోనా నేపథ్యంలో విధించిన మారటోరియంపై వడ్డీ విధించే విషయంలో పలువురు రుణగ్రహితలు బ్యాంకులను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నారు. యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థే మందగమనంలో నడుస్తున్న సమయంలో తాము మారటోరియం పెట్టుకున్నా దానిపై వడ్డీని వసూలు చేయడం సమంజసం కాదని అన్నారు.
ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిర్ణయాన్ని తప్పబట్టింది. ఆర్బీఐపై నెట్టి తప్పించుకోకుండా లాక్ డౌన్ విధించిన కేంద్రమే కాబట్టి మారటోరియంపై కూడా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇశాళ మరో మారు ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుందో వెల్లడించాలని సుప్రీంకోర్టు కోరింది. దీంతో ప్రస్తుతం అదే విషయమై తీవ్రంగా చర్చించిస్తున్నారని మరో రెండు మూడు రోజుల వ్యవదఇలో ఫైనల్ డిసీషన్ తీసుకుంటామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిజేసింది. కేంద్రం నిర్ణయాన్ని తెలియజేస్తే దానిని రికార్డు చేసి పిటీషనర్లకు అఫిడెవిట్ పంపించాలని న్యాయస్తానం సూచించింది.
వడ్డీ చెల్లింపుల అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు. అలాగే మారటోరియంపై వడ్డీలు విధించే అంశం కూడా కేంద్రం సమీక్షిస్తోందని తెలిపారు. దీనిపై అధిక ప్రాధ్యానతను ఇచ్చిన కేంద్రం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుందని.. ప్రస్తుతం ఈ నిర్ణయం ఖారారు చివరి దశకు చేరకుందని కూడా తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత, ఆ వివరాలతో పాటు అఫిడవిట్ సమర్పిస్తారని తెలిపారు. అక్టోబరు 1 కల్లా అఫిడవిట్ ను ఇ-మెయిల్ ద్వారా పంపిస్తారని చెప్పారు. దీనిపై తదుపరి విచారణ అక్టోబరు 5న జరుగుతుంద’ని జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, ఎం.ఆర్.షా సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more