రాజస్థాన్ రాజకీయం మళ్లీ రాజుకుంటోంది. గత కొన్ని రోజులుగా క్యాంపు రాజకీయాల్లో నిమగ్నమై ప్రత్యర్థి పార్టీల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో వున్నా అధికార పక్షం.. ఇక తమకు తగిన సంఖ్యా బలం వుందని.. దానిని శాసనసభలో నిరూపించుకునేందుకు కూడా తాము సిద్దమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు అనుమతిని ఇవ్వాలని గవర్నర్ ను కోరుతున్నా ఆయన ప్రకటనను వెలువరించకపోవడంతో ఏకంగా తన వర్గం ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ అధికార నివాసం ఎదుట భైఠాయించారు. దీంతో తాజా పరిస్థితి ప్రకారం గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్న రీతిగా పరిణామాలు మారాయి.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లాట్ ఇవాళ గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కలిశారు. అసెంబ్లీని సమావేశ పరచాలని కోరారు. అదే సమయంలో ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు రాజ్ భవన్ బయట ఆందోళన చేస్తూ.. తక్షణమే అసెంబ్లీని సమావేశ పర్చాలంటూ నినాదాలు చేస్తున్నారు. అనర్హత పిటిషన్లపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీని సమావేశ పరిచి బలపరీక్ష నిర్వహించాలని గహ్లాట్ భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ పిలుపునిచ్చే వరకూ తాము ఆందోళన విరమించబోమని తేల్చిచెప్పారు. దీంతో రాజ్ భవన్ వద్ద హైడ్రామా నెలకొంది. అయితే, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో గహ్లాట్ అసంతృప్తి వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తోందని, ఈ క్రమంలో తాజా పరిస్థితులపై అసెంబ్లీలో చర్చించాలని కోరానని అన్నారు. అసెంబ్లీలో తన సంఖ్యా బలాన్ని కూడా నిరూపించుకుంటానని ఆయన చెప్పారు, తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని, తమకు కావాల్సిన సంఖ్య కన్నా అధికంగానే బలముందని ఆయన చెప్పారు. నిన్నటి నుంచి గవర్నర్ ను ఈ విషయమే కోరుతున్నామని.. అయినా ఆయన స్పందించకపోవడం గర్హనీయమన్నారు. అయితే ఆయన అసెంబ్లీకి అనుమతించకపోవడానికి పై నుంచి వస్తున్న ఒత్తిడి కూడా కారణంగా అనిపిస్తోందని అనుమానాం వ్యక్తం చేశారు. గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలలే కానీ.. కేంద్రం చెప్పినట్టల్లా ఆడరాదని అన్నారు. దేశంలో ఇంత వరకూ ఎవరూ అసెంబ్లీని సమావేశపరచడానికి అనుమతి నిరాకరించలేదని గెహ్లాట్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more