కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ ఆంక్షల నుంచి తొలిసారిగా దేశంలోని జనజీవనం ప్రారంభమైంది. ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి కదం తోక్కుతోంది. దీంతో కరోనా కేసులు అధికంగా వెలుగుచూస్తున్న ప్రాంతాల్లో కేంద్రప్రభుత్వం, సహా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ దిశగా యోచిస్తున్నాయన్న వార్తలు వెలుగుచూశాయి. ఇందుకు తమిళనాడు ప్రభుత్వం చెన్నై సహ నాలుగు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వరకు లాక్ డౌన్ విధించడం కూడా ఈ వార్తలను బలపర్చింది. అయితే ఈ విషయంలో గత వారం రోజులుగా అనేక ఊహాగానాలు సోషల్ మీడియా వేదకగా సాగుతున్నాయి. దీంతో లాక్ డౌనా.? లేక అన్ లాకా.? అన్న అంశంలో ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు దేశ ప్రధని నరేంద్రమోదీ.
దేశంలో మరోమారు లాక్ డౌన్ వుండదని క్లారిటీఇచ్చారు. అంతేకాదు ప్రస్తుతం దేశంలో అన్ లాక్ 1.0 కొనసాగుతున్న క్రమంలో అన్ లాక్ 2.0ను ఎలా అమలు చేయాలా.? అన్న అంశంపై మాత్రమే సీఎంలతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించామని అన్నారు. సీఎం కేసీఆర్ లాక్ డౌన్ అంశాన్ని ప్రస్తావించి స్పష్టత కోరిన తరుణంలో ఇక దేశంలో లాక్ డౌన్ దశ ముగిసిందని.. అన్ లాక్ దశ ప్రారంభమైందని అన్నారు. దీంతో అన్ లాక్ 2.0పైనే దృష్టిసారించారని ప్రధానమంత్రి సీఎంలకు క్లారిటీ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు క్రమశిక్షణతో వ్యవహరించిన కారణంగా కరోనా వ్యాప్తిని అధికసంఖ్యలో సోకకుండా అడ్డుకోవడంలో విజయం సాధించామని అన్నారు. అదే సమయంలో కరోనా సోకిన రోగులను వివక్షతో చూడవద్దని ప్రధాని సూచించారు.
రాష్ట్రాలు కరోనా టెస్టుల సంఖ్యను మరింత పెంచాలని, వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుందని అన్నారు. దేశంలో కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య కూడా పెంచాలని.. దీంతో బాధితులను ఐసోలేషన్ కు తరలించిన వైద్యం అందించగలమని అన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుమారు 900 కరోనా పరీక్ష కేంద్రాలు ఉన్నాయని.. లక్షల సంఖ్యలో కరోనా ప్రత్యేక పడకలతో కూడిన అసుపత్రులు కూడా సిద్దంగా వున్నాయన్నారు. ఇక ఆక్సిజన్ సదుపాయంతో వేల సంఖ్యలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని ప్రధాని తెలిపారు.
‘కరోనాపై పోరాటంలో మన సహచరులను వివక్షకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపై వుందన్నారు. వైరస్ తమకు సోకుతుందన్న భయంతో బాధితులను సామాజికంగా దూరంగా పెట్టరాదని అన్నారు. ఇది భావోద్వేగంతో కూడిన అంశమని ప్రధాని అన్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతుందని ప్రసుత్తం ఇది రమారమి 53శాతంగా ఉందని అన్నారు.అయితే వైద్యులు, కేంద్ర ఆరోగ్యశాఖ సూచించినట్లుగా ప్రజలు మాస్కులు ధరించి.. బౌతిక దూరం పాటిస్తే కరోనాను దేశం నుంచి పారద్రోలడం కష్టమేమి కాదన్నారు. అయితే కరోనా వ్యాప్తి నియంత్రణ సూచనలు ఉల్లంఘించడంతో రోజు వేలాది మంది దీని బారిన పడుతున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more