చిత్తూరు కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అభంశుభం తెలియని అమాయక చిన్నారిని చిదిమేసిన మానవమృగానికి శిక్షను ఖరారు చేసి వెలువరించింది. పెళ్లికని తల్లిదండ్రుల వెంట వచ్చిన చిన్నారిపై లైంగికదాడికి పాల్పడటంతో పాటు అమెను తిరిగిరానీ లోకాలకు పంపిన కామాంధుడికి మరణశిక్షే సరైన శిక్షగా తీర్పును వెలువరించింది. చిన్నారిపై జరిగిన దారుణాన్ని చిత్తూరు జిల్లా పోలీసులు సవాలుగా తీసుకుని నాలుగు రోజుల్లో నిందితుడ్ని అదుపులోకి తీసుకుని.. కేవలం 17 రోజుల వ్యవధిలో చార్జీషీటు దాఖలు చేశారు.
దీంతో పాటు కేసులో ఆధారాలను సమకూర్చడం, పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలను న్యాయస్థానానికి సమకూర్చడంతో చిత్తూరులోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి వెంకట హరినాథ్ సంచలన తీర్పు వెలువరించింది. చిత్తూరు జిల్లాలో పోస్కో చట్టం కింద నమోదైన తొలి కేసును కేవలం వంద రోజుల వ్యవధిలో విచారణను ముగించి.. శిక్షను వెలువరించారు. కేసు విచారణ సంరద్భంగా న్యాయమూర్తి.. 41 మంది సాక్ష్యుల వాంగ్మూలన్ని నమోదు చేసుకున్నారు. ఆయన నిందితుడైన మహ్మద్ రఫీకి నేరం రుజువు కావడంతో నిందితుడి మహ్మద్ రఫీ (27)ని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది.
వివరాల్లోకి వెళితే.. గతేడాది నవంబర్ 7న చిన్నారి తల్లిదండ్రులతో కలిసి ఓ వివాహ వేడుక కోసం జిల్లాలోని కురబలకోటకు వెళ్లింది. ఈ క్రమంలో నిందితుడు మహ్మద్ రఫీ.. బాలికకు మాయ మాటలు చెప్పి కల్యాణ మండపం పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటనపై తల్లిదండ్రులు మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. నాలుగు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అతడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా న్యాయస్థానం 47 మంది సాక్షులను విచారించింది. దోషిగా తేలిన అనంతరం ఈరోజు మహ్మద్ రఫీకి మరణశిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more