పౌరహక్కు సవరణ చట్టాన్ని తీసుకురావడంతో పలు దేశాలలో వున్న మైనారిటీలకు భారత్ ఆశ్రయం కల్పిస్తోందని ప్రధాని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ.. లోక్ సభలో మాట్లాడిన ఆయన రాహుల్ గాంధీపై ట్యూబ్ లైట్ వ్యంగాన్ని ప్రదర్శించారు. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో కొందరు నేతలు పాల్గోని సెల్పీలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇక మరికొందరు ప్రత్యర్థులు మాత్రం యువతను తప్పదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఊటంకించారు.
ప్రధానిని మరో ఆరు, ఏడు నెలల తరువాత బయటకే రారని అన్నారు. తమకు ఉపాధి చూపించాలని యువత ఆయనను కర్రలతో కొట్టడంతో తగిలిన గాయాలకు ఆయన తన ఇంటి నుంచి బయటకు రారని అన్నారని.. ప్రధాని తెలిపారు. అయితే తాను ఈ సమయాన్ని మరిన్ని సూర్య నమస్కారాలు చేయడం కోసం వినియోగిస్తానని ప్రధాని అన్నారు. ఈ సూర్య నమస్కారాలతో తాను తిట్లు వినబడకుండా, దెబ్బలు తగలకుండా తయారవుతానని అన్నారు. అయితే ఆరు నెలల ముందుగానే తనకు అడ్వాస్ నోటీసు ఇచ్చినందుకు కృతజ్ఞడనని చమత్కరించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని మోడీ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపగా.. ఆయన రాహుల్ పై ట్యూబ్ లైట్ అంటూ విమర్శలు చేశారు. తాను అరగంట నుంచి సీఏఏపై మాట్లాడుతుండగా, అవతలి పార్టీ నేతలకు ఇప్పుడు వెలిగిందని, అరగంట నుంచి కరెంటు పాస్ అవుతూ ఇప్పుడు అభ్యంతరం చెప్పేలా చేసిందని అన్నారు. చాలా ట్యూబ్ లైట్లు ఇలానే వున్నాయని ఆయన వ్యంగోక్తులు విసిరారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ లోని మైనార్టీలను రక్షించాలని దివంగత ప్రధాని నెహ్రూ కూడా కోరుకున్నారని మోదీ చెప్పారు. ఆయన కూడా మతవాదా.? అని ప్రశ్నించారు.
రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నవారు జమ్ముకశ్మీర్ లో దశాబ్దాల పాటు దాన్ని అమలు చేయలేదని... జమ్ముకశ్మీర్ అల్లుడు, కాంగ్రెస్ నేత శశి థరూర్ అయినా ఈ విషయంలో కొంచెమైనా ఆవేదన వ్యక్తం చేయాలని ఎద్దేవా చేశారు. సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు చేసిన వారిని మీరు జైలుకు పంపలేదని... పైగా ఆ అల్లర్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని కూడా చేశారని మండిపడ్డారు. మరి మీరు చెబుతున్న రాజ్యాంగం అప్పుడేమైందని.? న్యాయం, చట్టం ఏమైందని ప్రశ్నించారు.
మహాత్మాగాంధీపై విమర్శలు గుప్పించారంటూ బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డేకు వ్యతిరేకంగా లోక్ సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో ప్రధాని నరేంద్రమోదీ లేచి నిల్చుని... అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. 'మహాత్మాగాంధీ అమర్ రహే' అంటూ నినదించారు. మోదీ ఈ మేరకు స్పందించిన కొన్ని నిమిషాల తర్వాత లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదురి మాట్లాడుతూ, ఇది ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. వెంటనే మోదీ కల్పించుకుని... ఇది మీకు ట్రైలర్ మాత్రమే కావచ్చు... మాకు మాత్రం మహాత్మాగాంధీ అంటే ఒక జీవితం అని చెప్పారు. మరి బీజేపి సభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.
ఇక లోక్ సభ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బయటకు రాగానే మీడియా ఆయనను చుట్టుముట్టి ఆయనపై ప్రధాని మోడీ చేసిన వ్యంగస్త్రాలపై ప్రశ్నించింది. కాగా దానిపై స్పందించేందుకు నిరాకరించిన రాహుల్.. దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారుతుందని.. ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో సాగుతోందని విమర్శించారు. ఈ విషయాలపై ప్రధాని ఎప్పుడు స్పందించరని.. అయితే దేశప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రం ఆయన నిత్యం శ్రమిస్తూవుంటారని విమర్శించారు. అలాగే ఇప్పుడు నిరుద్యోగం, ఆర్థిక తిరోగమనంపై మాట్లాడకుండా ఇలా సమస్యను పక్కదారి పట్టించారని రాహుల్ విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more