బీజేపీ నేత, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్రావుపై అత్యాచారం కేసు నమోదైంది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతినగర్కు చెందిన బాధితురాలు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ను కలిసి రఘునందన్పై ఫిర్యాదు చేసింది. గత 12 ఏళ్లుగా అతడు తనకు నరకం చూపిస్తున్నాడని ఆరోపించింది. కాఫీలో మత్తుమందు కలిపి అత్యాచారానికి ఒడిగట్టాడని, ఆ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడని కమిషనర్ ఎదుట వాపోయింది. కమిషనర్ ఆదేశాలతో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో రఘునందన్పై అత్యాచారం, బెదిరింపులు, ప్రాణహాని తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది.
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ 2003లో భర్తపై గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. అనంతరం అడ్వకేట్ అయిన రఘునందన్ను కలిసి పోషణ ఖర్చుల కోసం ఆయన సాయంతో సంగారెడ్డి కోర్టులో కేసు వేసింది. 2 డిసెంబరు 2007న కేసు గురించి మాట్లాడదాం రమ్మని ఇంటికి పిలిచిన రఘునందన్.. కాఫీలో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయం బయటపెడితే నగ్న చిత్రాలను నెట్లో పెడతానని బెదిరించాడని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే తనకున్న రాజకీయ పలుకుబడితో తనను బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేసింది.
గతేడాది మార్చిలో మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి న్యాయం చేయాలంటూ బాధిత మహిళ అర్థించింది. రఘునందన్పై కేసు నమోదు చేయాల్సిందిగా గత నెల 23న రామచంద్రాపురం పోలీసులను మానవ హక్కుల సంఘం ఆదేశించింది. ఆ తర్వాత ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా సజ్జనార్ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. తనపై అత్యాచారం కేసు నమోదు కావడంపై రఘునందన్ స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగా ప్రభుత్వమే ఈ పని చేస్తోందని ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more