ఓ ఇంజినీరింగ్ విద్యార్ధిని అత్యాచారం, హత్య కేసులో నిందితుడిని దోషిగా తేల్చిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. రాంచీ నిర్భయ కేసుగా గుర్తింపు పోందిన ఈ కేసులో నిందితుడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అభియోగాలు మోపిన తర్వాత కేవలం నెల రోజుల్లో విచారణ పూర్తిచేసిన రాంచీ కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. ఉన్నావ్ అత్యాచార కేసులో ఎమ్మెల్యే కుల్దీప్ సెన్గార్ ను దోషిగా తేల్చిన తరువాత ఈ కేసులోనూ నేరం రుజువుకావడంతో సీబిఐ మరో గౌరవాన్ని అందుకున్నట్లు అయ్యింది.
‘నిర్భయ’ ఘోరానికి సరిగ్గా నాలుగేళ్లు నిండిన రోజే 2016 డిసెంబర్ 16న రాహుల్ కుమార్ అనే మానవ మృగం రాంచీలోని ఓ ఇంజినీరింగ్ విద్యార్ధినిపై అత్యాచారం చేసి చంపేశాడు. రాంచీలోని బూటీ బస్తీకి చెందిన రాహుల్ రాజ్ అనే పైశాచిక మృగం కన్ను.. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి పై పడింది. ఓరమాంఝీ ప్రాంతంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం ఇంజనీరింగ్ చదవుతున్న విద్యార్థిని ఒంటరిగా వుంటున్న విషయం తెలుసుకున్న రాహుల్ రాజ్ డిసెంబర్ 15వ రాత్రి అమె ఇంట్లోకి వెళ్లి అత్యాచారం చేసి ఆ తరువాత అమెను చంపేశాడు.
అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు, విస్తృత గాలింపు అనంతరం గతేడాది జూన్లో నిందితుడిని లక్నోలో అరెస్ట్ చేశారు. అప్పటికే అతడు మరో నేరంలో జైలుకెళ్లి శిక్ష అనుభవిస్తున్నాడు. అక్టోబర్ చివరి వారంలో కోర్టు అతడిపై అభియోగాలు మోపింది. 30 మంది సాక్షులను క్షణ్ణంగా విచారించిన కోర్టు... అనంతరం మరో 16 రోజుల్లో తీర్పుతో ముందుకొచ్చింది. సరిగ్గా ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష పడిన రోజే.. రాజ్ను సీబీఐ కోర్టు దోషిగా ప్రకటించింది. బీహార్లోని నలందకు చెందిన నిందితుడు రాహుల్ రాజ్కు మరణశిక్ష విధిస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more