‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛమైన, అవినీతి రహిత, వివక్ష లేని పాలన అందిస్తాననీ, అక్రమాలకు తావులేకుండా ప్రక్షాళన చేస్తానని ఏపీలోని 6 కోట్ల ఆంధ్రులకు హామీ ఇస్తున్నా’ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం విజయవాడలోని సభావేదికకు వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులను ఉద్దేశించిన ప్రసగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తొలి రోజునే ఎల్లో మీడియాగా ముద్రపడిన టీడీపీ పత్రికలకు అల్టిమేటం జారీ చేశారు. తప్పుడు కథనాలను, వాస్తవం లేని, సత్యదూరమైన, నిరాధారమైన అరోపణలు ప్రచురించినా.. లేక ప్రసారం చేసినా తగ్గిన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో అవినీతి భారీ స్థాయిలో జరిగిందని అరోపించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇక తమ హాయంలో అలాంటి వాటికి అస్కారం లేకుండా హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యుడీషియల్ కమీషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు త్వరలోనే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తానని తెలిపారు. ఓ హైకోర్టు జడ్జీని జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు కేటాయించాల్సిందిగా కోరతామని వెల్లడించారు. దీంతో ‘ఏ కాంట్రాక్టు అయినా టెండర్లకు పోకముందే కమిషన్ ముందుకు పంపిస్తాం. న్యాయమూర్తి చేసే సూచనలు, మార్పులను తు.చ తప్పకుండా పాటిస్తాం. ఆ తర్వాతే కాంట్రాక్టులను పిలుస్తాం. అవినీతి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని సీఎం జగన్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్లో మీడియా ఉండటం నిజంగా ప్రజల ఖర్మ అని ముఖ్యమంత్రి విమర్శించారు. ‘ఈనాడును చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, టీవీ5ను చూసినా.. వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు. మిగతావారెవరూ ఇంపుగా కనిపించరు. మిగిలినవాళ్లను ఎలా దించాలన్న రీతిలోనే వీరి రాతలు ఉంటాయి. ఈ సంస్థలన్నింటికి నేను ఒక్కటే చెబుతున్నా. మీరు పారదర్శకమైన టెండర్లపై తప్పుడు కథనాలు రాస్తే పరువునష్టం దావా దాఖలు చేస్తాం. వీరిని శిక్షించాల్సిందిగా హైకోర్టును గట్టిగా కోరతాం. ఆరు నెలల నుంచి సంవత్సరం నాకు గడువు ఇవ్వండి. అవినీతి అన్నది ఏపీలో లేకుండా చేస్తానని జగన్ ప్రజలకు మాట ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more