తొలిదశ ఎన్నికలకు సరిగ్గా రెండు రోజుల ముందు.. బీజేపి పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన రోజున కాంగ్రెస్ పార్టీ కూడా రెండు కీలక ప్రకటనలు చేసింది. ఈ ప్రకటనల్లో నిరుద్యోగులతో పాటు అరోగ్యభారత నిర్మాణానికి పాటుపడతామంటూ ఎన్నికల వాగ్ధానాలను చేశారు. దేశంలోని నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి కల్పించే అంశాన్ని తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా వున్న నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఫేస్బుక్ పేజీ ద్వారా కీలక ప్రకటన చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అన్ని రకాల పరీక్షలకు ఫీజులు మాఫీ చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. దీంతో ఇకపై నిరుద్యోగ యువతీ యువకులు పలు పరీక్షల నిమిత్తం వేల రూపాయలను ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండాపోతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నిరుద్యోగ యువతీ యువకుల నుంచి పరీక్షఫీజుల పేరుతో డబ్బు వసూలు చేయడం వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా కష్టపెట్టమేనన్న భావన కాంగ్రెస్ వర్గాల్లో నెలకోంది.
ఇక దీంతో పాటు యావత్ భారత దేశం అరోగ్యంగా వుండేందుకు ‘రైట్ టు హెల్త్’ అనే కొత్త పథకాన్ని తీసుకువస్తామని కూడా రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా వెలువరించారు. భారత్ లోని పేద వర్గాల అరోగ్యమే పరమావధిగా భావించి దానికోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తామని రాహుల్ పోస్టులో పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో లోక్సభ తొలి విడత ఎన్నికలు జరగనుండగా రాహుల్ తాజాగా చేసిన ప్రకటన ఏ మేరకు ప్రభావాన్ని చూపిస్తుందో వేచి చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more