ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఎంతటి మహా నేతలకైనా అక్కడక్కాడా తిరస్కారాలు, చిత్కారాలు తప్పవు. అయితే ప్రజలపై పరోక్ష భారాలు వేసే నేతలకు మాత్రం వారి నియోజకవర్గాల్లో వ్యతిరేకత కూడా రావడం పరిపాటే. ఆయా నియోజకవర్గాల ప్రజలు ఆ నేతలకు తమ ఓటుతో బుద్ది చెప్పడం కూడా జరుగుతుంది. అయినా తమ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు, తన అనుయాయువులతో వ్యవహరాలను చక్కబెట్టి ఎన్నికలకు వెళ్తుంటారు నేతలు.
అయితే మాకు ఈ నేత వద్దు.. మరో నేతకు టిక్కెట్ ఇవ్వండీ అంటూపార్టీల అధిష్టానం ముందు అభ్యర్ధనలు కూడా వస్తాయి. అయితే ఇది ఆ నియోజకవర్గంలో టిక్కెట్ అశించే మరో నేత కార్యకర్తలు, అనుచరులు చేసే డ్రామాగా కొందరు కొట్టిపారేస్తుంటారు. ఈ విషయాన్ని కూడా పక్కనబెడితే.. ఆ నియోజకవర్గంలో వున్న సీనియర్ నేత. ఇక ఆ ఇలాకాలో ఆయన కాకుండా మరోకరు ఆ స్థానంపై కూడా కన్నువేయలేరు. అలాంటి స్థానం నుంచి ఈ సీనియర్ నేత మాకు వద్దు అంటూ పార్టీ నేతలు, ద్వీతీయ శ్రేణి నాయకగణం ఒక్కటై సమావేశం ఏర్పాటు చేశారంటే అది అభ్యర్థిపై పూర్తి వ్యతిరేకత.
సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కొడెల శివప్రసాద్ ఎదుర్కొంటున్నారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ను ఆశించే స్థాయిలో టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు లేకపోయినా.. వారు కోడెల శివప్రసాద్ అభ్యర్థిత్వాన్ని మాత్రం వ్యతరేకిస్తున్నారు. కొడెలకు సత్తెనపల్లి టిక్కెట్ కేటాయించవద్దని వారు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు సమావేశమై కొడెల అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ‘‘కొడెల వద్దు.. చంద్రబాబు ముద్దు..’’ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సొంత పార్టీవారి నుంచే గట్టి పోటీ ఎదుర్కోంటున్న కొడెలను టీడీపీ బరిలో నిలుపుతుందా.? అన్న సస్పెన్స్ కొనసాగుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more