ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అత్యంత చేరువలో వున్న గుంటూరు జిల్లా దాచేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కతువా, ఉన్నావ్ ఘటనలను దేశప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తూ.. నిందితులకు కఠిన శిక్ష్ వేయాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో.. దాచెపల్లిలో కూడా అదే తరహా ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల ఓ బాలికపై 55 ఏళ్ల సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బుధవారం (మే 2) సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్లు కొనిస్తానని మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి కిరాతకానికి ఒడిగట్టాడు. అనంతరం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి ఆ బాలికను ఆమె ఇంటి వద్ద దింపేసి వెళ్లిపోయాడు.
ఇంటికి వెళ్లిన బాలికకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలిని పరిశీలించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు చెప్పడంతో ఆ కన్నవాళ్లు హతాశులయ్యారు. బాలికను వివరాలు అడగ్గా.. అమె తనపై జరిగిన లైంగిక దాడి గురించి చెప్పింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణంపై స్థానికులు మండిపడుతున్నారు. దాచేపల్లి, మాచర్లలో ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిన్న రాత్రి నుంచి ఆందోళనలకు దిగారు. ఇవాళ కూడా అందోళనలను కొనసాగిస్తున్నారు.
అభం శుభం తెలియని బాలికపై అఘాయిత్యం జరిగిందని తెలియగానే.. స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాలికపై అత్యాచార ఘటనకు నిరసనగా ఇవాళ స్థానికంగా బంద్ కొనసాగిస్తున్నారు. నిందితుడు సుబ్బయ్య ఇంటికి వెళ్లిన అందోళనకారులు ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. కట్టలు తెంచుకున్న అగ్రహంతో ఊగిపోతున్న స్థానికులు మాచర్లలో రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. నిందితుడు సుబ్బయ్యను వెంటనే అరెస్ట్ చేయాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాచేపల్లి ఘటనపై ప్రభుత్వం స్పందించింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనపై వివరాలు తెలుసుకుని నిందితుడ్ని తక్షణం అరెస్టు చేయాలని అదేశించారు. దాచేపల్లి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అయన అధికారులను అదేశించారు. దీంతో హోం మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప గుంటూరు జిల్లా రూరల్ ఎస్సీతో ఫోన్ లో చర్చించి నిందితుడ్ని గంట వ్యవధిలో అరెస్టు చేయాలని అదేశించారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు.. దాచేపల్లి ఘటనను పలువురు సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. భారత సనాతన ధర్మంలో అడవారిని పూజించిన ధర్మం మనదని.. ఇలాంటి ధరణిపై అడపడచులపై దారుణాలా.. అందునా అభం శుభం తెలియని చిన్నారి బాలికపైనా అత్యాచారాలా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. కథువా, ఉన్నావ్ అత్యాచార ఆగ్రహజ్వాలలు చల్లారకముందే.. అలాంటి ఘటనలు కొనసాగుతుండటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more