హైదరాబాద్ నగరంలో అకలితో అలమటించే వారికి ఐదు రూపాయలకే కడుపునిండా అన్నం పెడుతూ పేదల పాలిట కల్పతరువుగా మారిన పథకం ఇప్పటికే అనేక మంది ప్రశంసలను పోందింది. పథకం అనగానే ప్రభుత్వ పథకం ఆరంభ శూరత్వం అని మాత్రమే అనుకోకండీ.. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు రుచికి, సుచికి ఆదర్శంగా నిలుస్తుంది. జీహెచ్ఎంసీ అధికారులు ఈ కేంద్రాలలో అకస్మికంగా వెళ్లి అన్నం రుచిని కూడా పరీక్షించి కితాబునిచ్చిన విషయం తెలిసిందే.
ఇదే క్రమంలో ఐదు రూపాయల బోజనం కేంద్రాని సందర్శించిన కేటీఆర్ కూడా అక్కడ బోజనాన్ని భుజించారు. దీంతో వేనోళ్ల పోగడుతున్న ఈ పథకం అనుకున్న దాని కన్నా బ్రహ్మండంగా అమలు చేస్తున్న తీరు కూడా నచ్చిన. మెచ్చిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఇవాళ పరిశీలించారు. నగరంలోని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హరే కృష్ణ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న భోజన కేంద్రానికి వెళ్లారు. మండే ఎండలో సాధారణ పౌరుల మాదిరాగానే అయన కూడా క్యూ లైనులో నిల్చుని భోజనం తీసుకున్నారు.
అనంతరం బోజనాన్ని భుజిస్తూ.. రుచి బాగానే వుందని, ఇక అన్నం కూడా ఇంట్లో చేసుకున్నట్లుగానే వుందన్నారు. తెలంగాణలో ఈ కార్యక్రమం విజయవంతమైందని, అయితే క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్న అలోచనతోనే తాము ఇక్కడికి వచ్చామన్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు తాము యోచిస్తున్న క్రమంలో ఇక్కడికి వచ్చి విధానాన్ని పరిశీలించినట్లు చెప్పారు. తన నియోజక వర్గం పేదలకు సొంతంగా భోజనం పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more