మధ్యప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్ కు చెందిన రమేష్ బాబుకు ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్నతో 12 సంవత్సరాల క్రితం వివాహామైంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. మధ్యప్రదేశ్ నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన ఆయన విశాఖపట్నం జీసీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే స్వప్నకు మొదటి సంతానంగా అమ్మాయి పుట్టిందని రమేష్ స్వప్నను వేధిస్తున్నాడు. ఆ తర్వాత రెండో కాన్పులో కూడా అమ్మాయే పుట్టింది. దీంతో స్వప్నపై వేధింపులు మరింత పెరిగిపోయాయి. పుట్టిన కుమర్తెలతో కూడా అతను ప్రేమపూర్వకంగా వ్యవహరిచేవాడు కాదు. దీంతో గత కొంత కాలంగా వారిరువురు విడివిడిగా ఉంటున్నారు. అయితే స్వప్న తన భర్త రమేష్ బాబుతో ఉండటానికి ఇంటికి వెళితే రమేష్ బాబు ఆమెను ఇంట్లోకి రానివ్వడం లేదు. తనకు విడాకులు కావాలని కోరుతూ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. విశాఖ జీసీసీ ఎండీ రమేష్ కుమార్ పై ఆయన భార్య స్వప్న త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రమేష్ కుమార్.... స్వప్నల మధ్య గత కొంతకాలంగా విడాకుల వివాదం నడుస్తోంది. రమేష్ కుమార్....మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డైవర్స్ ఇవ్వాలని తీసుకోవాలని స్వప్నపై ఒత్తిడి తీసుకురాగా.... అందుకు ఆమె నిరాకరిస్తోంది. తనకు విడాకులు వద్దని.... భర్తతో కలిసి ఉంటానని చెబుతోంది. దీనిపై అప్పట్లో స్వప్న స్త్రీ శిశు సంక్షేమ శాఖకు ఫిర్యాదు చేసింది. స్వప్నకు ఇద్దరు ఆడపిల్లలు కావటంతో ఆమెను భర్త విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వేధింపులు ఎక్కువ కావటంతో ఈ రోజు ఉదయం స్వప్న కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలు రమేష్ కుమార్ తల్లిదండ్రులు నివాసం వద్ద ఆందోళనకు దిగారు. వేధింపులకు గురి చేస్తున్నరమేష్ కుమార్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అక్కడ నుంచి తరలించారు. ఏసీపీ డీఎస్ మహేష్, సీఐ శ్రీనివాసరావులు .... ఇరు కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more