108 emergency services bandh from today

108 Employees Bandh, 108 emergency services bandh from today, 108 emergency services bandh,108 ambulance,

108 emergency services bandh from today

108 సేవలన్నీ బంద్

Posted: 07/20/2013 08:10 PM IST
108 emergency services bandh from today

జిల్లాలో 108 వాహన సేవలన్నీ నిలిచిపోయాయి. దీంతో అనేక మంది క్షతగాత్రులు సకాలంలో ఆస్పత్రులకు చేరలేక ఇబ్బంది పడ్డారు. తమకు జీవీకే యాజమాన్యం సరైన జీతాలు ఇవ్వడం లేదని, సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ సిబ్బంది ఆందోళనకు దిగారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. తమ సమస్యలపై కొన్ని నెలలుగా జీవీకే ఈఎంఆర్ఐ యాజమాన్యానికి తెలియజేశామని, అలాగే వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ ఇంతవరకు స్పందించలేదన్నారు. రోజుకు ఎనిమిది పనిగంటలు కాగా అందరితో 12 గంటలు చేయిస్తున్నారని, విధి నిర్వహణలో ప్రమాదం జరిగితే యాజమాన్యం ఆదుకోవాలని, బెయిల్, కోర్టు ఖర్చులు ఇవ్వాలని వారు కోరారు. ప్రభుత్వం ప్రతి ఏటా వాహనాల నిర్వహణకు బడ్జెట్ పెంచుతున్నా.. వీరు మాత్రం తమ జీతాలు పెంచడం లేదని ఆరోపించారు. కనీస వేతనం రూ.15వేలు, ఎనిమిది గంటల పనిదినం అమలు చేయాలన్నారు. అదే విధంగా ఉద్యోగులపై వేధింపులు, అక్రమ బదిలీలు, సస్పెన్లన్లు ఆపాలని కోరారు. చట్టప్రకారం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వమే 108 సర్వీసులను నడపాలని తాము డిమాండ్ చేస్తున్నామని, వీటిని నెరవేర్చేవరకు ఆందోళన చేస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more