Minister c ramachandraiah vows to protect calves

minister c ramachandraiah, calves protection, sri varahalakshmi nrusimha swamy temple, simhachalam and calves, jercy calves,

minister c ramachandraiah vows to protect calves

జెర్సీ కొడెదూడల వల్లే సమస్యలు.?

Posted: 05/23/2013 02:44 PM IST
Minister c ramachandraiah vows to protect calves

జెర్సీ దూడలను మొక్కుబడి కింద చెల్లించ వద్దంటూ దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య రైతులకు, భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఆయన గోశాలను సందర్శించారు. సింహాచల దేవస్థానం అధీనంలో సుమారు 20 ఎకరాల్లో గోశాలను నిర్మిస్తున్నామని, ఇందులో 1000 గోవులు, దూడలను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

అలాగే జర్సీ దూడలను మొక్కుబడిగా చెల్లించవద్దంటూ గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా మంత్రి ఎదుటే మంగళవారం ఒక కోడె దూడ ప్రాణాలు వదిలింది. ఉదయం నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన ఈ దూడను కాపాడేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు. సరిగ్గా మంత్రి గోశాలలోకి అడుగుపెట్టిన కొద్ది సేపటికే ఈ దూడ ప్రాణాలు విడిచింది. దీంతో మంత్రి రామచంద్రయ్య బాధపడ్డారు. కోడె దూడ చనిపోయిందో లేదో మరోసారి నిర్థారించుకోవాలని కోరారు. దూడ చనిపోయిందని డాక్టర్లు నిర్థారించారు.

ఈ సంఘటన తో మంత్రి చలించిపోయారు. 15 రోజుల్లో సింహాచలం గోశాలలో పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తామన్నారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే గోవులను పరిరక్షిస్తామని అందుకోసం ఎంత ఖర్చయినా భరించడానికి తమ శాఖ సిద్ధంగా ఉందన్నారు. సమస్యంతా జెర్సీ కోడెదూడల వల్లే వస్తోందని మంత్రి చెప్పారు. వ్యవసాయానికి పనికిరాని, ఎటువంటి ఉపయోగం లేని జెర్సీ కోడెదూడలను చిన్న వయస్సులోనే కోంతమంది దేవస్థానాల వద్ద వదిలి వెళ్ళిపోతున్నారని మంత్రి అన్నారు.

పదిహేను రోజుల్లో ఇక్కడ పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువస్తామని, పశుసంవర్థక శాఖ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ నేతృత్వంలో 30 మంది వైద్యబృందం వారం రోజులుగా కోడెదూడలకు వైద్య సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి 30 ఎకరాల్లో తాత్కాలికమైన ఏర్పాట్లు జరిగాయని త్వరలో పూర్తిస్థాయి గోశాల ఈ ప్రాంతంలో రూపుదిద్దుకుంటుందని మంత్రి చెప్పారు. అఖిల భారత గో సంరక్షణ సమితిలో అనేక స్వచ్ఛంద సంస్థలు కోడెదూడలను స్వీకరించేందుకు ముందుకు వస్తున్నాయని వీరికి అప్పగించేందుకు కూడా తమకు అభ్యంతరం లేదని మంత్రి చెప్పారు.

కోడెదూడల అక్రమ రవాణా దురదృష్టకరమని మంత్రి రామచంద్రయ్య అన్నారు. ఇప్పటికే దేవస్థానం గోవుల మరణాలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం మరింత బాధాకరమని అక్రమ రవాణా వార్త మీడియాలో చూసి షాకయ్యానని మంత్రి అన్నారు.

గోవుల స్వీకరణకు శాశ్వత విధానం

భక్తులు కానుకల రూపంలో సమర్పించే గోవుల స్వీకరణకు దేవస్థానంలో పకడ్బందీగా ఒక శాశ్వత విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. పశుసంవర్థక శాఖ అధికారులు, పశువైద్యులు నిర్ధారించిన తరువాతనే స్వీకరిస్తామన్నారు. అనారోగ్యంతో అవసాన దశలో ఉన్న గోవులను దేవస్థానాల్లో వదిలి వెళ్ళవద్దని, అటువంటి మొక్కుబడులు ఎవరికీ శ్రేయస్కరం కాదని మంత్రి సూచించారు. అంతకు ముందు ఆయన దేవస్థానం ఇఓ కె.రామచంద్రమోహన్, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావులను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more