Visakhapatnam on the literary gubalimpu

visakhapatnam, literary, gurram jashuva statue, viswanath satyanarayana, c ranayarana reddy, ramakrishna, t subbaramireddy,

Visakhapatnam on the literary gubalimpu

విశాఖ తీరాన సాహితీ గుబాళింపు

Posted: 05/11/2013 10:16 AM IST
Visakhapatnam on the literary gubalimpu

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, తెలుగు సాహిత్యపు గుబాళింపులను విశ్వవ్యాప్తం చేసిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, కవికోకిల, నవయుగ కవితా చక్రవర్తి గుర్రం జాషువా, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి విగ్రహాలను అతిథులు విశాఖలో ఆవిష్కరించారు. లోకనాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో ఇక్కడి రామకృష్ణ సాగర తీరంలో ఈ ముగ్గురు మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ జరిగింది. పార్లమెంటు సభ్యుడు జెడి.శీలం, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బాలమోహన్‌దాస్, జాషువా అల్లుడు డాక్టర్ లవణం, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయరాజ్ పాల్గొన్నారు.

విగ్రహావిష్కరణకు ముందు గజల్ శ్రీనివాస్ సినారె గజల్స్‌ను గానం చేసి సాహితీప్రియులను ముగ్ధులను చేశారు. సభను ఉద్దేశించి పార్లమెంటు సభ్యుడు జెడి.శీలం మాట్లాడుతూ ముగ్గురు మహనీయులు తమ అసమాన రచనలతో ఆంధ్రుల గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేశారన్నారు. పుట్టరాని కులంలో పుట్టినందుకే తనకు రావాల్సిన గౌరవం రాలేదని జాషువా అనేక సందర్భాలలో బాధపడ్డారని అన్నారు. గుణాత్మకతతో అసమానలను తొలగించిన కవి జాషువా అన్నారు. ఎయు, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో జాషువా పీఠాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇటీవల జ్ఞానపీఠ్ అవార్డు పొందిన రావూరి భరద్వాజ ఆంధ్రులు గర్వించదగిన వ్యక్తి అని అన్నారు. విగ్రహాలు ఆవిష్కరించిన ఆవరణలో సాహితీవేదిక ఏర్పాటుకు ఎంపి నిధుల నుండి రూ.3 లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు. కళాబంధు,

రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ తెలుగుజాతి గర్వించదగిన ఈ ముగ్గురు త్రిమూర్తి సమానులని అన్నారు. సినారె తన గరువని, మంచితనం, విశాలహృదయుడని అన్నారు. సాహితీ కళావేదిక ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. ఆచార్య బాలమోహన్‌దాస్ మాట్లాడుతూ తెలుగు సాహిత్య రచనల్లో ఘనులని అన్నారు. ఉపాధ్యాయులైన వీర విలక్షణమైన రచనలతో ఖ్యాతినార్జించినట్టు తెలిపారు. లవణం మాట్లాడుతూ విశ్వనాథ తండ్రి వంటి వారైతే,

జాషువా మామని, సినారే సోదర సమానులని అన్నారు. జాషువా బతికుంటే తనకంటే ముందు జ్ఞానపీఠ్ వచ్చేదని అనే వారన్నారు. యార్లగడ్డ మాట్లాడుతూ రావూరి భరద్వాజ సభకు హాజరుకావాల్సి ఉందని, స్వల్ప అనారోగ్యం కారణంగా రాలేకపోయారని తెలిపారు. ఇదే ప్రాంగణంలో రావూరి భరద్వాజ విగ్రహాన్ని అనతికాలంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more