తెలుగువారి నూతన సంవత్సరం అయిన శ్రీజయనామ సంవత్సర ఉగాది పర్వదినం వచ్చేసింది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వచ్చే ఈ ఉగాది పండుగను హిందువులు ఎంతో ఆధ్యాత్మికంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.
శిశిరు ఋతువు వెళ్లిపోయి వసంత ఋతువుతో మొదలయ్యే ఈ జయనామ సంవత్సరంలో.. చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. పండ్లు, పిందెలు అంటూ ఒక్కసారిగా వాతావరణం ఆకుపచ్చగా మారిపోతుంది. మహళలు తమ ఇంటి ముందు రంగవల్లికలు వేసుకుని.. ఎంతో ఆకర్షణీయంగా అలంకరించుకుంటారు.
ఉగాది పర్వదినం రోజు ప్రతిఒక్కరు రకరకాల వంటకాలు, ప్రత్యేకమైన రెసిపీలు తయారుచేసుకుంటారు. అందులో కొన్ని రెసిపీల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం....
ఉగాది పచ్చడి :
ఉగాది పండుగలో ఇది ప్రత్యేకమైంది. ఈ పచ్చడితోనే ఉగాది ప్రారంభమవుతుంది. దీనితర్వాతే ఇతర పండివంటకాలు, రెసిపీలను తయారుచేసుకుంటారు.
పచ్చడికి కావలసిన పదార్థాలు :
చింతపండు - 50 గ్రాములు ; బెల్లం - 150 గ్రాములు ; మామిడికాయ - 1 ; మిరియాల పొడి - జీలకర్ర - వేపపూత - ఉప్పు (రుచికి సరిపడేంత) ; ద్రాక్ష పళ్లు - 20 ; కొబ్బరికోరు - ఒక కప్పు ; కమలాపండు - 1 ; అరటిపళ్లు - 2
తయారుచేసే విధానం :
1. మొదటగా చింతపండును శుభ్రమైన నీటిలో కొద్దిసేపు వరకు నానబెట్టి ఆ తరువాత గుజ్జులా పిసకాలి. అందులో సరియైన పరిమాణంలో నీటిని పోసి కలపాలి.
2. ఇంకోపక్క బెల్లంను తీసుకుని బాగా నూరుకోవాలి. ఈ నూరిన బెల్లంను చింతపండు నీటిలో కలుపుకోవాలి.
3. అలాగే ఉప్పు, జీలకర్ర, వేపపూత, మిరియాల పొడి, కొబ్బరికోరు మొదలైనవి ఆ మిశ్రమంలో వేయాలి.
4. ద్రాక్ష, అరటిపళ్లు ముక్కలు, కమలాపళ్లు గుజ్జును అందులో కలుపుకోవాలి.
ఇలా ఈ విధంగా షడ్రుచుల మిశ్రమంతో ఉగాది పచ్చడిని ఎంతో రుచికరంగా తయారుచేసుకుంటారు.
అరటి అవడలు రెసిపీ :
కావలసిన పదార్థాలు :
అరటికాయలు - 3 ; పెరుగు - 1/2 కిలో ; కరివేపాకు - ఒక కట్ట ; జీలకర్రపొడి - 10 గ్రాములు ; కారం - 10 గ్రాములు ; పోపు దినుసులు - 10 గ్రాములు ; రీఫైన్డ్ ఆయిల్ - సరిపడేంత ; ఉప్పు - రుచికి తగినంత
తయారుచేసే విధానం :
1. మొదటగా ఒక పెనుమును తీసుకుని అందులో కొద్దిపాటి నీటిని పోసుకోవాలి. అందులో అరటిపళ్లను వేసి.. అవి మునిగేంతవరకు వేడి చేసుకోవాలి.
2. అలా ఉడకబెట్టిన అరటికాయ తొక్కును తీసివేసి, మెత్తగా చేసుకోవాలి.
3. అలా మెత్తగా చేసుకున్న తరువాత అందులో తగినంత ఉప్పు, జీలకర్ర, కారంపొడి కలిపి ఒక పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
4. వడలు చేసే విధంగా వీటిని వత్తి నూనెలో ఎర్రగా వేయించాలి.
5. ఇంకొకవైపు పెరుగును బాగా కలియబెట్టి.. అందులో ఉప్పు కలపాలి. అలాగే కరివేపాకు, పోపు దినుసులతో తాలింపు పెట్టాలి.
ఇలా ఈ విధంగా తయారుచేసుకున్న ఈరెండు పదార్థాలను కలుపుకుని తింటారు.
కజ్జికాయ రెసిపీ :
కావలసిన పదార్థాలు :
మైదాపిండి (అరకిలో) ; పంచదాక (ఒక కిలో) ; పాలకోవా (పావుకిలో) ; జాపత్రి (2 గ్రాములు) ; యాలకులు (2 గ్రాములు) ; శెనగపిండి (50 గ్రాములు) ; వంట సోడా (పావు టేబుల్ స్పూన్) ; బేకింగ్ పౌడర్ (పావు టేబుల్ స్పూన్) ; నెయ్యి (100 గ్రాములు) ; నూనె (తగినంత)
తయారుచేసే విధానం :
1. ముందుగా శెనగపిండి తీసుకుని అందులో కోవా కలిపి కొంచెం వెయించాలి. కాసేపు తరువాత దానిని దించి ఒక్క పక్కన పెట్టుకోవాలి. అందులో జాపత్రిపొడి, యాలకుల పొడి, కొంచెం పంచదారను కలిపి ముద్దగా తయారుచేసుకోవాలి.
2. బాణలిలో మిగిలిన పంచదారను వేసి.. అందులో రెండుగ్లాసుల నీళ్లు పోయాలి. లేత పాకం వచ్చేంతవరకు దానిని వేయించి దించాలి.
3. మైదాపిండి తీసుకుని అందులో కొంచెం వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిసి జల్లించాలి. అందులో కరడుగట్టిన నెయ్యి, కొంచెం నీళ్లు కలిపి గట్టి ముద్దలా తయారుచేసుకోవాలి.
4. ఆ ముద్దలను చిన్నచిన్న నిమ్మకాయ సైజులో చేసుకుని.. పూరీలా, కొంచెం మందంగా వత్తాలి. దాని మధ్యలో కోవా మిశ్రమాన్ని కలిపి.. అర్థచంద్రాకారంలో మూసేయాలి. అంచులను తడిచేసి, కోవాకు దగ్గరగా వుండేట్లు చుట్టాలి.
5. ఇలా కజ్జికాయ రూపంలో తయారుచేసుకుని వాటిని నూనెలో వేసి రంగు వచ్చేంతవరకు వేడి చేసుకోవాలి.
6. ఈ కజ్జికాయలను పంచదాక పాకంలో వేసి తీసుకుంటే.. ఎంతో రుచికరంగా వుంటాయి.
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more