అహోబిలం
కర్నూలు జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ నరసింహస్వామి పుణ్య క్షేత్రం. ఈ క్షేత్రం కర్నూలు నుండి 150 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ క్షేత్రంలో నరసింహ స్వామి 9 రూపాలలో కొలవబడతాడు. అహోబిలం చాలా వరకు నల్లమల్ల అడవులలోనే విస్తరించి ఉన్నది. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అని రెండు భాగాలుగా ఉండి, దట్టమైన అడవుల గుండా, మట్టి రోడ్ల మీదుగా సాగే యాత్ర అనిర్వచనీయం.