మిల్ఖా సింగ్.. అత్యంత ప్రతిభావంతుడైన క్రీడాకారుడు. ఒక సిక్కు రాథోడ్ రాజపుత్రుల కుటుంబంలో జన్మించిన ఈయనకు బాల్యం నుంచే ఎన్నో పరాభావాల్ని ఎదుర్కోవల్సి వచ్చింది. దేశ విభజన సమయంలో తన కుటుంబసభ్యుల మరణాన్ని ప్రత్యక్షంగా చూసిన ఈయన ఎన్నో కష్టనష్టాలు, అవమానాలు భరించాల్సి వచ్చింది. అంతెందుకు.. ఈయన జీవితం ఎంత దుర్భరంగా సాగిందంటే.. ఒకానొక దశలో దొంగగా మారాలని నిర్ణయించుకున్నాడు కూడా! అటువంటి పరిస్థితుల్లో వున్న ఈయనను అన్నయ్య సహకారంతో భారత సైన్యంలో చేరి.. అక్కడ తన ప్రతిభా చాటుకున్నాడు. అప్పటివరకు పరుగేంటో కూడా తెలియని ఈయన.. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఫ్లయింగ్ సిఖ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించాడు. దేశ విభజన సమయంలో అనాథగా మారిన మిల్ఖా సింగ్, తరువాత కాలంలో భారతదేశపు ప్రసిద్ధ క్రీడా చిహ్నంగా అవతరించాడు. ఎన్నో మెడల్స్ సాధించి భారతదేశం ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాడు.
జీవిత విశేషాలు :
1935వ సంవత్సరంలో మిల్ఖాసింగ్ 15 సంతానం కలిగిన ఒక సిక్కు రాథోడ్ రాజపుత్రల కుటుంబంలో జన్మించాడు. అందులో 8 మంది సంతానం దేశ విభజనకు ముందు చనిపోగా.. విభజన సమయంలో జరిగిన హింసకాండలో తన తల్లిదండ్రులతోపాటు ఒక సోదరుడిని, ఇద్దరు సహోదరీమణులను పోగొట్టుకున్నాడు. కొంతకాలం తర్వాత పాకిస్తాన్ నుండి భారత్ కు రైలులో వచ్చాడు. 1947లో పంజాబ్ రాష్ట్రంలో హిందువులు, సిక్కుల ఊచకోత తీవ్రంగా జరుగుతున్నప్పుడు ఈయన ఢిల్లీకు వలస వెల్లిపోయాడు. ఆ తరువాత తన సోదరి ఇష్వర్ వద్ద నివసించాడు. ఓ సందర్భంలో మిల్ఖా సింగ్ టిక్కెట్టు లేకుండా రైలులో ప్రయాణం చేసినందుకు పోలీసులు ఆయన్ను తీహార్ జైలులో బంధించారు. అప్పుడు ఇష్వర్ తన తమ్ముడిని విడిపించుకోవడానికి తన దగ్గర వున్న కొంత నగదును అమ్మి విడుదల చేయించింది. అంతేకాదు.. ఇంకా ఎన్నో దుర్భర పరిస్థితుల్ని మిల్ఖా సింగ్ ఎదుర్కొన్నాడు.
అలాంటి దుర్భరమైన జీవితంతో విసిగిపోయిన మిల్ఖాసింగ్.. దోపిడి దొంగగా మారాలని నిశ్చయించుకున్నాడు. కానీ.. తన సోదరుడు మల్ఖన్ ఆయన్ను ఒప్పించి భారత సైన్యంలో చేర్పించాడు. 1951లో ఆయనకు తన 4వ ప్రయత్నంలో సికింద్రాబాద్ లోని ఎలెక్ట్రికల్ - మెకానికల్ ఇంజినీరింగు కేంద్రంలో ప్రవేశం లభించింది. కాలక్రమేణా తను క్రీడలకు పరిచయమయ్యాడు. కొత్తగా నియమితులైన సైనికులందరికీ తప్పనిసరైన ఒక జాతీయ స్థాయి పరుగుల పోటీని భారత సైన్యం నిర్వహించగా, ఆ పోటీల్లో మిల్ఖా సింగ్ 6వ స్థానంలో ముగించాడు. దాంతో భారత సైన్యం అతనికి వ్యాయామ క్రీడలలో ప్రత్యేక శిక్షణ కల్పించింది. తనను క్రీడలకు పరిచయం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఇంకొక విషయం ఏమిటంటే.. బాలుడి వున్నప్పుడు ఈయన తన పాఠశాలకు రాను, పోను 10 కిలోమీటర్ల దూరం పరుగెత్తేవాడు. ఆ అలవాటే ఆయన్ను పరుగు పోటీల్లో విశ్వవిజేతగా నిలిచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
క్రీడా జీవితం :
పరుగు క్రీడల్లోకి ఎంట్రీ ఇచ్చిన మిల్ఖాసింగ్.. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ లో జరిగిన 200, 400 మీటర్ల పరుగుల పోటీలకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. అయితే.. ప్రధాన పోటీకి అర్హత సాధించలేకపొయాడు. 1958లో దేశంలోని కటక్ లో నిర్వహించిన జాతీయ క్రీడల్లో మిల్ఖా సింగ్ 200, 400 మీటర్ల పరుగుల పోటీల్లో స్వర్ణపతకం సాధించాడు. అదే సంవత్సరంలో జరిగిన ఆసియా క్రీడల్లో కూడా స్వర్ణపతకాన్ని గెలుపొందాడు. అలాగే.. 1958 బ్రిటిష్ సామ్రాజ్యం, కామన్వెల్త్ సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ క్రీడల్లో 46.6 సెకన్ల సమయంలో పరుగుల పోటీని పూర్తిచేసి స్వర్ణపతకాన్ని సాధించిన ఈయన.. స్వతంత్ర భారతదేశం తరపున బంగారు పతకం సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడిగా కీర్తి గడించాడు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more