డా.బెజవాడ గోపాలరెడ్డి.. ఆంధ్రరాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. స్వాతంత్ర్య ఉద్యమ పోరాటాల్లో వీరోచిత వీరుడిగా పోరాడిన ఈయన.. బహుభాషావేత్త కూడా. పదకొండు భాషల్లో పండితుడైన ఈయన.. ఎన్నో రచనలు రాశారు. అంతేకాదు.. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఉత్తర ప్రదేశ్ కు గవర్నర్ గా, రాజ్యసభ సభ్యుడుగా పనిచేశారు. సాహితీ, రాజకీయ రంగాలలో తనదైన విశిష్ట స్థానాన్ని స్థాపించుకుని, 90 సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపిన పూర్ణపురుషుడు.
జీవిత విశేషాలు :
1907 ఆగష్టు 7వ తేదీన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో పట్టాభిరామిరెడ్డి, సీతమ్మ దంపతులకు గోపాలరెడ్డి జన్మించారు. తన సొంత ఊరిలోనే కళాశాల చదువు పూర్తి చేసిన ఈయన.. ఆ తర్వాత బందరు జాతీయ కళాశాలలో చేరారు. 1927లో శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యను పూర్తి చేశారు. ఒక వైపు జాతీయోద్యమం మరోవైపు సాహిత్యపిపాస రెండూ ఈయన జీవనంలో పెనవేసుకున్నాయి. రవీంద్రుని గీతాంజలిని తెనిగించిన సాహితీవేత్త. తిక్కవరపు రామిరెడ్డిగారి కుమార్తె లక్ష్మీకాంతమ్మను వివాహమాడారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొత్తం 186 నెలలకాలంలో ఈయన వివిధ రాజకీయ పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.
రాజకీయ జీవితం :
బ్రిటీష్ ఇండియాలో వారికి వ్యతిరేకంగా జరిపిన స్వాతంత్ర్య పోరాటాల్లో గోపాలరెడ్డి పాల్గొన్నారు. జాతీయోద్యమంలో పాల్గొని చెరసాలల్లో సంవత్సరాల తరబడి గడిపారు. 30 సంవత్సరాలు నిండకముందే రాజాజీ మంత్రివర్గంలో అవిభక్త మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాతే ఈయన తిక్కవరపు రామిరెడ్డిగారి కుమార్తె లక్ష్మీకాంతమ్మను వివాహమాడారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు 1955లో ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో విశాలాంధ్ర ఏర్పడినపుడు హైదరాబాదు రాజధానిగా ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ కేంద్రంలో మంత్రిగా ఆహ్వానించి రెవిన్యూ మంత్రిని చేశారు. అనంతరం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఐదేళ్ళపాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరించారు. ఈ విధంగా ఆయన మొత్తం 186 నెలలకాలంలో వివిధ రాజకీయ పదవులు నిర్వహించారు.
సాహితీ రంగంలో గోపాలరెడ్డి పాత్ర :
1946 నుండి తెలుగుభాషా సమితి అధ్యక్షులుగా వ్యవహరించిన ఆయన.. ఆ తర్వాత 1957-82 అంటే 25 సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా పనిచేశారు. 1978 నుండి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులు. 1963 నుండి ఎనిమిదేళ్ళు జ్నానపీఠ అధ్యక్షులు. అనేక భాషలలో సన్నిహిత పరిచయం గల గోపాలరెడ్డి రవీంద్రుని గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. తొలుత అనువాదాలతో ప్రారంభమై డెబ్బయివ ఏట స్వతంత్ర రచనలు మొదలుపెట్టారు. 1978లో తొలి స్వీయ కవితాసంపుటి వెలువరించారు. గోపాలరెడ్డి నోబెల్ బహుమతి గ్రహీతయైన రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన ఊర్వశి, గీతాంజలి వంటి పలు రచనలను తెలుగులోకి అనువదించారు. ఈయన 1997 మార్చి 9వ తేదీన తుదిశ్వాస విడిచారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more