ఝాన్సీ లక్ష్మీభాయి బాల్యం... మణికర్ణిక బాల్యమంతా గడిచింది బిఠూర్లోనే. రోజూ తనతో మనుని యాగశాలకు తీసుకెళ్లేవాడు మోరోపంత్. అక్కడ పదులకొద్దీ యువకులు ఉదయం పూట వేదాలు వల్లెవేసేవారు, సాయంవేళ శారీరక కసరత్తులు చేసేవారు. ఆ యాగశాలే ఆరేళ్ల మనుకి పాఠశాలయ్యింది. ఆ మగపిల్లలే ఆమెకు స్నేహితులు. వారితోనే కలిసి తిరగడం... తినడం.... ఆడడం! ఏ నిర్బంధాలూ లేకుండా గాలిలో గువ్వపిల్లలా ఎదిగింది. ఆ వేదనాదాలు, వ్యాయామాలూ ఆ చిన్నపిల్ల మనసుపై చెరగని ముద్ర వేశాయి. ఆ చిన్నవయసులోనే తానూ యుద్ధవిద్యలు నేర్చుకోవాలని తహతహలాడిపోయేది మను. పీష్వాబాజీరావు పెంపుడు కొడుకు నానా సాహెబ్, అతడి అన్న కొడుకు రావుసాహెబ్- సాముగరిడీలు చేస్తుంటే- కళ్లు విప్పార్చుకుని చప్పట్లు చరుస్తూ ఎగిరి గంతులేస్తూ- హుషారెక్కి పోయేది మను. ఓ రోజు రావుసాహెబ్ పట్టపుటేనుగు ఎక్కి దర్జాగా వెళ్తున్నాడు. తననూ ఎక్కించుకోమని బతిమాలింది మను. ‘‘నువ్వు చిన్నపిల్లవు, పైగా ఆడపిల్లవు’’ అంటూ ఎగతాళి చేశాడు రావుసాహెబ్. వెక్కిరింతగా నవ్వాడు పక్కనే ఉన్న నానాసాహెబ్. దాంతో రోషం తన్నుకొచ్చి భళ్లున ఏడ్చేసింది మణికర్ణిక. కానీ ఆ అవమానమే ఆమెలో పౌరుషాన్ని రగిలించింది. ఎప్పటికైనా అంబారీ ఎక్కాలని, గుర్రమెక్కి కరవాలాన్ని థళథళా మెరిపించాలని, సైనికవిద్యలు నేర్చుకోవాలని బలంగా అనుకుంది. తనకు సామువిద్యలు నేర్పమంటూ ఓసారి ఏకంగా బాజీరావునే అడిగింది. ముద్దుగా ఉండే మణికర్ణిక అంటే ఆయనకు ప్రాణం. ఛబిలి( అందమైనది) అంటూ ప్రేమగా ఆ పాపను పిలుచుకునేవారాయన. అలాంటి మను ముచ్చటను ఆయనెందుకు కాదంటారు? అందుకే ఆమెకు - కర్ర, కత్తిసాము, విలువిద్య, గుర్రపుస్వారీలలో- ఆ వయసుకు తగ్గంత - తర్ఫీదు ఇవ్వడం మొదలెట్టారాయన! పెళ్లితో కష్టాలు! అడుగడుగునా అవమానాలు... భర్త మరణించాక ఝాన్సీలక్ష్మీబాయికి కష్టాల మీద కష్టాలొచ్చాయి. బ్రిటిషర్లు ఆమెను తీవ్రంగా బాధపెట్టారు. దత్తత చెల్లదన్నారు. ఝాన్సీపై ఆమెకు హక్కులేదన్నారు. భర్త వదిలి వెళ్లిన వ్యక్తిగత స్థిరచరాస్తులు ఆమెకు చెందవన్నారు. ఖజానా అప్పుల్ని మాత్రం ఆమే తీర్చాలన్నారు. అయిదు వేల రూపాయల భరణాన్ని బిచ్చంగా వేస్తామన్నారు. పరోలా జాగిర్దారు, ఓర్జా రాణి, దాంతియా రాజుల్ని లక్ష్మీబాయిపై ఉసిగొల్పారు. చివరకు ఝాన్సీనే ఆక్రమించుకుంటున్నట్లు ప్రకటించారు.మొదట ‘మేరీ ఝాన్సీ దూంగీ నహీ’ అంటూ హూంకరించింది లక్ష్మీబాయి. కానీ బ్రిటిష్వారి దౌష్ట్యాలకు తలొగ్గక తప్పలేదు. ఝాన్సీ కోటపై తెల్లవారి కేతనం చూసేసరికి రాణి గుండె తరుక్కుపోయింది. రాజవంశానికి ఇలవేల్పయిన మహాలక్ష్మి దేవాలయాన్ని బ్రిటిషర్లు భ్రష్టుపట్టించారు. ప్రజల్ని హింసించడం మొదలుపెట్టారు. రానురాను ఆంగ్లేయుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తనను తెల్లవారు వెంటాడి, వేటాడి వేధించినా భరించింది కానీ రాజ్యానికి, ప్రజలకు, అంతకుమించి ధర్మానికి, సంఘానికి కష్టాలు దాపురించడంతో ఇక ఆమె ఉపేక్షించదలచుకోలేదు. ఆఖరిపోరాటం... తుదిపోరుకు తెర లేచింది. 1858, ఏప్రిల్ 4. శుక్లపక్ష ఏకాదశి.. అర్ధరాత్రి. ఎర్ర కుర్తా, తెల్ల చుడీదార్, కుచ్చు తలపాగా, ఒళ్లంతా కవచం, శిరస్త్రాణం, ఒరలో రెండు పిస్టళ్లు, నడుముకు కత్తులు, వీపుకి పదేళ్ల దత్తపుత్రుడు దామోదర్, సంచిలో డబ్బు, కొడుకు పాలు తాగే వెండి లోటా, వెనుక 300మందికి పైగా అఫ్గాన్ రౌతులు, పార సైన్యం... ఇంత పకడ్బందీగా తనకిష్టమైన గుర్రం ‘సారంగి’ని ఎక్కి, సమరానికి బయల్దేరింది లక్ష్మి. నూటరెండుమైళ్లు ఆగకుండా ఏకబిగిన ప్రయాణం చేసింది. మార్గమధ్యంలో వందలాది మందిని ఎదుర్కొంటూ, నరుక్కుంటూ కదనరంగానికి చే రుకుంది. రెండు నెలలు భీకరంగా పోరాడింది. బ్రిటిష్వారి బలం, బలగం ముందు తాను సరిపోనని ఆమెకు తెలుసు. కొడుకును జాగ్రత్తగా చూసుకోమని తోటివారికి అప్పగించింది. ఇక తనకేమైనా ఫరవాలేదన్న తెగింపుతో యుద్ధం చేసింది. 1858, జూన్ 17న రోజు రోజంతా తెల్లసేనను చీల్చి చెండాడింది. బ్రిటిష్వారు కుయుక్తులు పన్నారు. వెన్నుపోటు పొడిచారు. ఝాన్సీలక్ష్మీబాయి యుద్ధరంగంలో బ్రిటిష్ సేనలతో భీకరంగా పోరాడుతోంది. అంతలో అకస్మాత్తుగా ఓ ఆంగ్ల సైనికుడు కత్తి ఆమె ఛాతీకింద పొడిచాడు. రక్తం ధార కట్టింది. అయినా పులిలా రాని తిరగబడి అతణ్ణి చంపేసింది. మెరుపువేగంతో మరో బ్రిటిష్ సైనికుణ్ణి హతమార్చింది. అంతలో ఓ బుల్లెట్ ఆమె తొడలో దిగబడింది. ఎడమచేత్తో ఆ గాయాన్ని అదిమి పట్టుకుని కుడిచేతి కరవాలంతో ఆ తెల్లవాడిని నరికింది. కానీ ఒకేసారి నలుగురు శత్రుసైనికులు ఆమెను చుట్టుముట్టారు. తలపై ఒకడు వేటు వేశాడు. ఆమె కుడికన్ను వెలికి వచ్చింది. అయినా రాణి ఊపిరి బిగపట్టి ఒకడి భుజాన్ని ఛిద్రం చేసింది. చివరకు వారంతా మూకుమ్మడిగా ఆమె దేహాన్ని తునాతునకలు చేశారు. విలవిల్లాడుతూ లక్ష్మీబాయి నేలకొరిగింది’’ చివరకు- అదేరోజు- చివరి రక్తపుబొట్టు వరకూ పోరాడి... మరణించింది. ఇదీ వీరనారి అంతిమ పోరాట దృశ్యం. లక్ష్మీబాయి. విజయం అంటే గెలవడమే కాదు, పోరాడడం! ఆమె బతికింది 23 ఏళ్లే. అయితేనేం... ఆమె జీవితం ఓ ఒరవడి, సాహసం, ఓ ఉదాహరణ. ఆమె ఝాన్సీకి మహారాణి... కానీ సదా అవరోధాలు, అవమానాలు ఆమెను వెంబడించాయి. అయినా ప్రాణం ఉన్నంతవరకు పోరాడిందామె. కష్టాలకు కుంగిపోకుండా రెట్టించిన పట్టుదలతో యుద్ధం చేయడమే జీవితమని నిరూపించిన ధీరనారి లక్ష్మీబాయి. |
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more