రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై తీవ్ర వివాదాలు రేగుతున్న విషయం తెలిసిందే! విభజన జరిగినప్పటి నుంచి సాగుతున్న ఈ ఫీజు వివాదం ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు. ఆ వ్యవహారాలెలా వున్నా.. గత రెండేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం లేదు. ఈ విషయంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ ఇందిరాపార్కు వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం ఒక రోజు దీక్షి చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి ఫీజు విషయంపై మాట్లాడుతూ.. గత రెండేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం లేదని ఆరోపించారు. ఈ విషయానికి సంబంధించి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను రాష్ట్రమంత్రులే బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ను ప్రభుత్వం బేఖాతరు చేసిందని అన్నారు.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి ప్రజలు షాక్ ఇస్తారని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందని ఆయన సూచించారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more