కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఆపార్టీ అధికారికంగా ప్రకటించనుంది. విశ్వ సనీయ సమాచారం ప్రకారం జనవరి 17న జరుగనున్న ఏఐసిసి సమావేశంలో ఈ మేరకు లాంఛనంగా ప్రకటన జారీ కానున్నట్లు తెలుస్తోంది. వెయ్యి మంది పార్టీ ప్రతినిధులు తరలిరానున్నారు. రాహుల్ను ప్రధాని అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహాలను చర్చించేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ప్రకటించినా రాహుల్కు పట్టం కోసమే భేటీని ఏర్పాటు చేసినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతినడం తెలిసిందే. ఫలితాల తర్వాత రాహుల్తో కలిసి విలేకరులతో మాట్లాడిన సోనియాగాంధీ.. సరైన సమయంలో పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ఓవైపు బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థి మోడీ దూసుకుపోతుంటే కాంగ్రెస్ తన అభ్యర్థి విషయంలో తాత్సారం చేయడం పనికిరాదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు యూపీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్నాయి. తాము వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపెట్టుకోబోమని డీఎంకే ప్రకటించగా.. ప్రజలు బలహీనమైన నాయకత్వాన్ని కోరుకోవడం లేదంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రధాని అభ్యర్థి విషయంలో ఇంకా ఆలస్యం చేయడం సరికాదని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం పార్టీ శ్రేణులకు ఈ విషయం పై అనసవరపు ఊహాగానాలకు తావివ్వవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇక అమ్మ కోడుకు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more