మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పై గత మూడు రోజుల నుండి ఘాటైన విమర్శలు గుప్పింస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ పై విమర్శలు చేసినందుకు, పీసీసీ అద్యక్ష్యుడు , రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకల్పించుకొని, నోరు అదుపులోపెట్టుకోవానలి సూచించాడు. అంతేకాకుండా జేసి పై కాంగ్రెస్ హైకమాండ్ లేఖ రాయటం జరిగింది. దీంతో జేసి మళ్లీ రెచ్చిపోయాడు. బొత్స సత్యనారాయణపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటున్నానని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తనపై చర్యలు తీసుకోవాలని బొత్స ఏఐసీసీకి లేఖ రాయటం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలు మాట్లాడుతుంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని జేసీ అన్నారు.
అయిన నన్ను సీఎల్పీ కార్యాలయానికి రాకుండా అడ్డుకునేదెవరు? అని జేసి ప్రశ్నించారు. సైకో ఫ్యాన్స్ మాత్రమే తనను విమర్శిస్తున్నారని జేసి ఆరోపించారు. తనను కాంగ్రెస్ నుంచి బహిష్కరించడానికి బొత్స ఎవరిని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. కాగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని, ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేనేలేదని జేసీ నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బొత్స సత్యనారాయణను ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, కేంద్రంలోని మంత్రులు, ఎంపీలను సస్పెండ్ చేసిన తరువాతే తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విభజనకు దారితీసిన పరిస్థితులను వివరించి, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని జేసీ అభిప్రాయపడ్డారు.
ఒకపక్క సీమాంద్ర కాంగ్రెస్ ఎంపీలు సొంత పార్టీ పై అవిశ్వస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. పార్లమెంట్ లో సొంత పార్టీ ఎంపీలే పరువు తీస్తున్నారు. ఇక్కడ సొంత పార్టీ నాయకులే రోడ్డునపడి, కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారు. ఇలాంటి నాయకులు ప్రజలకు ఏం మేలు చేస్తారని చూసే ప్రజలు అనుకుంటున్నారు. అయిన జేసిలో ఏం నిజాయితీ ఉందని మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావటంలేదని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోవటానికి జేసి అనేక దార్లను చూసుకుంటున్నాడు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ పై ఇలా బరితెగించి విమర్శలు చేస్తున్నాడని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ఇలాంటి నాయకులపై సోనియా గాంధీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more