వైఎస్ జగన్మోమహన్ రెడ్డి .. రాయలసీమాలో పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఈరోజు రాష్ట్రం పై సరికొత్త డిమాండ్ వినిపించారు. సమైక్యాంద్ర కోసం పోరాటం చేస్తున్న జగన్ రాష్ట్ర విభజనను అడ్డుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. . ఈరోజు జగన్ చిత్తూ జిల్లా బైరెడ్డి పల్లి గ్రామంలో జరిగిన సమైక్య శంఖరావం సభలో మాట్లాడుతూ.. రాయలసీమను కూడా అడ్డంగా నరకడం దేనికి? అన్ని జిల్లాలను తెలంగాణలో కలిపి తెలంగాణ రాష్ట్రంగా పేరు మార్చండని జగన్ సలహా ఇచ్చారు. తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నట్లు తెలిపారు. రాయలసీమను విడగొట్టడం దేనికి? తెలంగాణ రాష్ట్రం అని పేరు పెడితే ఎవరద్దంటారు? అని అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులు మాత్రం రాష్టం విడిపోవాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రం విడిపోతే తలెత్తే సమస్యలు వీరికి తెలుసా? అని ప్రశ్నించారు. నదీ జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే వీరు ఎందుకు నివారించలేకపోయారని అడిగారు. రాయలసీమలో అట్టడుగున ఉన్న చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అందరూ సమైక్య రాష్ట్రం కోరుకుంటున్నట్లు తెలిపారు.
అందువల్లనే చిట్టచివరి నియోజకవర్గం కుప్పం నుంచి సమైక్య శంఖారావం పూరించినట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ సమైక్యమే కావాలని కోరుకుంటున్నారని తెలియజెప్పేందుకే ఈ శంఖారావం యాత్ర అని తెలిపారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య యుద్దం జరుగుతుందని చెప్పారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ నుంచి దుర్మార్గులను పంపిద్దామన్నారు. వచ్చే ఎన్నికలలో 30 లోక్ సభ స్థానాలను గెలుచుకుందాం, రాష్ట్రం విడిపోకుండా చూసుకుందాం అన్నారు. అయితే సమైక్యాంద్ర కోసం చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి పోరాడుతున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీ ల నాయకులు కలిసి సమైక్యం కోసం పోరాటం చేస్తే బాగుంటుందని సభకు వచ్చిన ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more