Seemandhra congressleaders meet president on telangana

Seemandhra Congressleaders meet President on Telangana, President Pranab Mukherjee, ministers, MPs and MLAs from Seemandhra,

Seemandhra Congressleaders meet President on Telangana

రాష్ట్రపతి ఎటువైపు?

Posted: 10/25/2013 11:24 AM IST
Seemandhra congressleaders meet president on telangana

సీమాంద్ర ప్రజలు, నాయకులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకుల ద్రుష్టి రాష్ట్రపతి మీదే ఉంది. ఆయన ఇప్పుడు ఎటువైపు? అనేది ఎవరికి అర్థం కావటం లేదు. సీమాంద్ర నాయకులు .. రాష్ట్రపతి పైనే ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన పై రాష్ట్రపతి ఎటు వైపు మొగ్గుచూపుతారో అనేది ఇప్పుడు రాజకీయ నాయకుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సీమాంద్ర నాయకుల చివరి ఆశలు.. రాష్ట్రపతి పైనే పెట్టుకున్నారు. ఢిల్లీలో సీమాంద్ర నేతలు రాష్ట్ర విభజన ను అడ్డుకోవటానికి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.

 

రాష్ట్రపతి భవన్‌లో సీమాంధ్ర నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసి విభజన వలన తలెత్తే పలుసమస్యలను విన్నవించారు. భేటీలో సీమాంధ్ర మంత్రులు డా సాకే శైలజనాథ్‌, టీజీ వెంకటేశ్‌, గంటా శ్రీనివాసరావు, తోట నర్సింహం, అహ్మదుల్లా, పితాని సత్యనారాయణ, ఎంపిలు కేవీపీ రామచంద్రరావు, రాయపాటి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, సాయి ప్రతాప్‌, లగడపాటి రాజగోపాల్‌, సుమారు 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు పాల్గొన్నారు. అంతకుముందు వారు ఏపీ భవన్‌లో కూర్చుని చర్చించిన తర్వాత రాష్ట్రపతిని కలిశారు.రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌ అధిష్టానం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఇది దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ప్రమాదకరమని సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

 

మంత్రి శైలజనాథ్‌ మాట్లాడుతూ, విభజన సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జరుగుతోందని రాష్ట్రపతితో వివరించినట్టు చెప్పారు. విభజనకు కాంగ్రెస్‌ అధిష్టానం అనుసరిస్తున్న విధానాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని, దీంతో మరిన్ని సమస్యలకు అవకాశం కలుగనుందన్నారు. విభజనతో అనేక సమస్యలు తలెత్తుతాయని చెప్పామన్నారు. సీమాంధ్ర ప్రజల మనో భావాలు పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని రాష్ట్రపతికి చెప్పినట్టు తెలిపారు. విభజన రాజ్యాంగానికి వ్యతిరేకంమని, అంతేకాకుండా ప్రజాస్వామిక విధానాలకు కూడా వ్యతిరేక మన్నారు. విభజనను నిబంధనలకు అనుగుణంగా చేపట్టడం లేదన్నారు. అసెంబ్లి తీర్మానం లేకుండా ఏ రాష్ట్రం విడిపోలేదని వివరించారు. ఈ రకమైన వ్యవహారాలను రాష్ట్రపతి తనకున్న అధికారాలను వినియోగించి విభజనను అడ్డుకోవాలని కోరినట్టు తెలిపారు. బిల్లును, తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లికి పంపేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరామన్నారు.

 

గతంలో రెండు రాష్ట్రాల అసెంబ్లి తీర్మానాల ద్వారా విలీనం అయ్యాయని, విభజన విషయంలోనూ ఆ పద్ధతినే అనుసరించాలని కోరామన్నారు. అసెంబ్లికి సంబంధం లేకుండా విభజనకు పూను కుంటున్నట్టు తమకు సమాచారం ఉందని, ఈ రకమైన పద్ధతి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని చెప్పామన్నారు. రాష్ట్ర చరిత్రలో విలీనం, విభజనలు అనేక మార్లు చోటు చేసుకున్నట్టు మంత్రి టీజీ వెంకటేశ్‌ తెలిపారు. మద్రాసు నుండి ఆనాడు రాష్ట్రం విడిపోయిందన్నారు. హైదరాబాద్‌ రాష్ట్రం కూడా మూడు ముక్కలుగా విడిపోయిందని, ఆతర్వాత తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఏర్పాటు చేశారన్నారు.

 

తాజాగా మరోసారి రాష్ట్రాన్ని విభజించేందుకు చేసే ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉంటుందన్నారు. దీనిని రాష్ట్రపతి తన అధికారాలతో ఆపాలని కోరామన్నారు. మంత్రి గంటా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ, తాము విభజనపై చెప్పిన విషయాలను సావధానంగా రాష్ట్రపతి విన్నట్టు తెలిపారు. రాష్ట్రపతి సీమాంధ్ర ప్రతినిధుల బృందంతో ఏమీ చెప్పకపోయినప్పటికీ రాష్ట్రపతి తీరు చూస్తుంటే విభజనను ఆపేందుకు కృషి చేస్తారనే విశ్వాసం కలుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో జరిగిన విషయాలను కూడా రాష్ట్రపతికి వివరించినట్టు చెప్పారు. ప్రణబ్‌ కేంద్ర మంత్రిగా పనిచేసిన రోజుల్లో విభజనపై ఒక పద్ధతి ప్రకారం అనుసరించారని, ఇప్పుడు అంతా ఏకపక్షం అవుతోందని చెప్పామన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ హైకమాండ్ తో రాష్ట్ర విభజన పై ఎలాంటి నివేదిక సమర్పిస్తారో.. రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఒకే అంటారో, లేక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతారో వేచి చూడాలి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more