వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ .. బ్రదర్ అనిల్ కుమార్ హస్తం .. ఆ కుంభకోణంలో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆ కుంభకోణానికి. బ్రదర్ అనిల్ కుమార్ కు ఉన్న బంధం గురించి భారతీయ జనతా పార్టీ నాయకులు గురించి చెబుతున్నారు. అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో బ్రదర్ అనిల్కుమార్ పాత్ర ఉందని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 హెలికాప్టర్లను ఇటలీ నుంచి కొనుగోలు చేసిన సందర్భంలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో రూ.3,546 కోట్లు చేతులు మారాయన్న విషయం బయటకు పొక్కడంతో ఇప్పటికే సిబిఐతో విచారణ జరిపిస్తున్నారని తెలిపారు.
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై అనిల్ ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి కూడా ఒక హెలికాప్టర్ కొనుగోలు చేయించారని తెలిపారు. తొలుత రూ.30 కోట్లు మాత్రమే కొనుగోలు కోసం వెచ్చిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం తదుపరి ఆ మొత్తాన్ని రూ.45 కోట్లకు పెంచి కేటాయించిందని తెలిపారు. ఈ మొత్తం విషయంలో ఇటలీకి చెందిన విచారణ సంస్థ కొద్ది రోజుల క్రితం స్విట్జర్లాండ్లో హస్కీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుందని తెలిపారు. రాష్ట్రం కొనుగోలు చేసిన హెలికాప్టర్ విషయంలో బోర్సే, హస్కీ, బ్రదర్ అనిల్లు మధ్య వర్తిత్వం వహించారని అన్నారు. ఆ హెలికాప్టర్ ఎయిర్షోలో అనిల్కు పెద్దపీట వేశారని, షోలో అనిల్ రన్వేపై కూర్చుని షోను తిలకించడమే కొనుగోళ్ళలో అనిల్ పాత్ర ఉందనడానికి ప్రత్యక్ష నిదర్శ నమంటూ అనిల్ రన్వేపై ఉన్న ఫోటోను విలేకరుల ముందు ప్రదర్శించారు.
ఈ కుంభకో ణంలో స్విట్జర్లాండ్లో అరెస్టు చేసిన దళారీ హస్కీని భారత్కు తీసుకువచ్చి బ్రదర్, హస్కీలను ముఖాముఖి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కొనుగోలు విషయంలో అ ప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్రెడ్డి నాలుగు సార్లు ఇటలీ వెళ్ళి వచ్చారని, ఆయన ఇటలీకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? దీనిలో ఆంతర్యమేమిటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో అనిల్కు సంబంధాలు ఉన్నాయని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. భారత రక్షణ వ్యవస్థలో గతంలో జరిగిన బోఫోర్స్ లాంటి కుంభకోణాలు అనేకం జరుగుతున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభాకర్ ప్రశ్నించారు. ఇంకా ఎంతోకాలం ఇలా ప్రజలను మోసగించలేరని, త్వరలో నిజాలు బయటకు రాక తప్పదని.. బీజేపి నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more