గత రెండు నెలలుగా సీమాంధ్రలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె విరమణపై ప్రభుత్వం పాచిక పారింది. ఫలితంగా నేటి నుండి సీమాంధ్ర జిల్లాల్లో ఆర్టీసీ డ్రైవర్లు క్లచ్ పై కాలుపెట్టడంతో.. ఆవేశంగా ఆర్టీసీ కండెక్టర్లు టిక్కెట్లు చించుతున్నారు. ప్రజలు ఆనందంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగించాటానికి సిద్దమవుతున్నారు. రవాణా శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ ఉచ్చులో ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు చిక్కుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసుకునే ప్రతిపాదనను సాకుగా చూపి రవాణాశాఖ మంత్రి బొత్స వేసిన ఎరకు పడ్డ కార్మిక సంఘాల నేతలు సమ్మెను విరమించేందుకు సిద్ధపడ్డారు.
సమైక్య నినాదాన్ని అడ్డం పెట్టుకుని కార్మిక సంఘాల నేతలు తమ డిమాండ్లను తీర్చుకునేందుకే ప్రాధాన్యతనిచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో పలుసార్లు చర్చలు జరిపిన మంత్రి బొత్స చివరకు రాత్రి 11 గంటలకు నాటకీయ పరిణామాల మధ్య వారితో సమ్మెను విరమింప చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధనకై తెలంగాణలో జరిగిన సకల జనుల సమ్మెలో కూడా మంత్రి బొత్స ముందుగా ఆర్టీసీ కార్మికుల చేత సమ్మె విరమింప చేసి ఆ ఉద్యమానికి గండికొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. సీమాంధ్ర సమ్మెలో కూడా అదే మంత్రి బొత్స ఆర్టీసీ కార్మికుల చేత సమ్మెను విరమింప చేసేయడంలో కృతకృత్యులైయ్యారు.
ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకోవాలన్న డిమాండ్తో పాటు కార్మిక సంఘాలు ప్రతిపాదించిన మరో 12 డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. వాటి పరిష్కారానికి ప్రభుత్వం లిఖితపూర్వక హామీని ఇచ్చింది. ప్రభుత్వంలో విలీనం చేసుకునే దిశలో అప్పటికప్పుడు విలీనం, ఆర్థిక సమస్యలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న సమ్మె వల్ల జరిగిన నష్టంపై అధికారులు వివరించారు. దీనిపై నేతలు కూడా బాధపడ్డారు.
కానీ, అనివార్యంగా సమ్మె చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఆ తర్వాత సంస్థకు వస్తున్న నష్టాలు, గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, తదుపరి విలీనంపై ఒక్కో అంశంపై చర్చలు జరిగాయి. మొత్తంమీద ఉద్యోగ సంఘాలు ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధపడడంతో సమ్మె విరమించేందుకు కార్మిక సంఘాలు అంగీకరించాయి. నేటి నుంచి బస్సులు యథావిధిగా నడుపుతామని మంత్రికి నేతలు హామీ ఇచ్చారు. ప్రభుత్వం, కార్మిక సంఘాలు సంస్థ అభివృద్ధికి కృషి చేద్దామని భరోసా ఇచ్చాయి. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించినందుకు కార్మిక సంఘాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తమ డిమాండ్లను పరిష్కరించిందుకు సంఘాల నేతలు ధన్యవాదాలు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more