ఒకే రోజు ఒకే రాష్ట్రంలో రెండు సభలు జరిగాయి. అయితే ఈ రెండు సభల వల్ల ప్రజలు ఎంత ఉపయోగం, ఉందో తెలియదు గానీ, నాయకులకు మాత్రం బాగా ఉపయోగం ఉందనే విషయం అర్థం అవుతుంది. సమైక్యాంద్ర కోసం కర్నూలులో నిర్వహించిన సమైక్య ప్రజా గర్జన సభలో సమైక్యాంద్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ.. మనసున్న మేథావుల్లారా మాట్లాడుకుందాం రండి? అని సామరస్యంగా పిలుపునిచ్చారు. ఇరుప్రాంతాల ప్రజలను ద్రుష్టిలో పెట్టుకొని అశోక్ బాబు ఇరుప్రాంతాల మేథావులకు పిలుపునివ్వటం జరిగింది. అయితే ఒకే వేదిక పై ఇరుప్రాంతాల మేధావులు కలిసి రాష్ట్రం పై చర్చలు జరిపితే బాగుంటుందని .. సమైక్యాంద్ర ఉద్యమానికి నాయకుడు అశోక్ బాబు కోరటంలో.. అర్థం ఉందని ఇరుప్రాంతాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే అదే సమయంలో హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగిన సకలజన భేరి సభ జరిగింది. అయితే తెలంగాణ ప్రజలు భారీ సంఖ్యలో సభకు రావటం జరిగింది.
తెలంగాణ ప్రజలు రాష్ట్ర విభజన కోరకే ఈ సభకు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా, ఆ సభలోని టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ , తన స్వార్థ రాజకీయాల కోసం మాటల తూటాలను పేల్చారు. అయితే కేసిఆర్ పేల్చిన మాటల తూటాలు అప్పటి వరకే బాగుంటాయి. అంటే ఆ సమయంలో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమే కేసిఆర్ లక్ష్యం. అందుకు.. ఆంద్రా వాళ్లును, ఒక శత్రువు వర్గంగా భావించి, మైకు ముందు పెద్ద మొనగాడు మాదిరిగా మాట్లాడి, రాజకీయ లబ్ధి పొందటమే కేసిఆర్ లక్ష్యం. అందుకే.. సీమాంద్ర నాయకులపై మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటమే కేసిఆర్ లక్ష్యం. తెలంగాణ ప్రాంతంలో.. మేథావులు , కవులు, ఉద్యమకారులు, ఉన్నారు. తెలంగాణ ప్రజలు అభిమానానికి, అనురాగానికి మారుపేరు. స్వచ్చమైన మనసు కలిగిన తెలంగాణ ప్రజల మనసుల్లో .. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయం కోసం.. విషబీజాలు నాటుతున్నారు.
ఆంధ్రప్రజలు, తెలంగాణ ప్రజలు ఎప్పుడైన, ఎక్కడైన అన్యాయం చేసినట్లు ఉందా? ఇరుప్రాంతాల రాజకీయ నాయకులు ఆడిన ఆటల్లో.. ఇరుప్రాంతాల ప్రజలు నలిగిపోతున్నారు. బంధంతో కలిసిన తెలుగు ప్రజలు మద్య విభజన చిచ్చు పెట్టింది ఎవరు రాజకీయ నాయకులే. ఉద్యమం వల్ల ఇరుప్రాంతాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కానీ ఇరుప్రాంతాల నాయకులకు మాత్రం ఎలాంటి నష్టం లేదు. ఇరు ప్రాంతాల నాయకులు తమ తమ వ్యాపారాలను లాంచనంగా చేసుకున్నారు. అసలు ఉద్యమాలు దేనికి? ఉద్యమం ఎందుకు పుడుతుంది? ప్రజలకు తీరాని అన్యాయం జరిగినప్పుడు? ఉద్యమం పుడుతుంది. దీనికి కారణం ఎవరు..మన రాజకీయ నాయకులే. గతంలో మంత్రి పదవి రాలేదని.. బయటకు వచ్చి, ఉద్యమాన్ని ఆసరగా చేసుకొని .. ఒక పార్టీ పెట్టి, తెలంగాణ ప్రజలను అతి భయంకరంగా వాడుకొని, అందలం ఎక్కిన కేసిఆర్, నిజంగా తెలంగాణ రాష్ట్రం కోరుకుంటే.. తెలంగాణ ప్రజల కోసం ఏం చేసారో బహిరంగంగా చెప్పాలి. తెలంగాణ ప్రజలు, ఆంద్రా వాళ్లు అంటూ వీడదీసి .. అపారమైన ఆస్తులు సంపాదించుకున్న విషయం ఇరుప్రాంతాల ప్రజలకు తెలుసు. అయితే ఈరోజు రాష్ట్ర విభజన ఏర్పాడుతున్న తరుణంలో.. ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు. మీకు రాజకీయ శత్రువులు అనేక మంది ఉంటారు.
అయితే వారిని రాజకీయంగానే ఎదుర్కోండి? అంతేగానీ, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే. ఉద్యమ సభలో.. రాజకీయపు మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు వల్ల.. నీకు నష్టం అనేది ఉండదు. కానీ నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజలకు చాలా నష్టం జరుగుతున్న విషయం మార్చిపోతున్నావు. సభను సక్సెస్ చేయ్యటానికి ..మరో ప్రాంతా ప్రజలు తిట్టడం బావ్యం కాదు. అసలు రాష్ట్ర విభజన అనేది ఎంత వరకు అవసరమో అనే విషయం తెలంగాణ ప్రజలు చెప్పాలనే విషయం కూడా మార్చిపోయి, కల్లు తాగిన కోతిలా..అరుపులు అరుస్తావ్, ఈ మాయ అరుపులు తెలియాని అమాయక ప్రజలు .. ఆనందంతో ఊగిపోతున్నారు. ఆ సభలో వేడి పుట్టించటానికి నీవు మాట్లాడే ప్రతి మాట వెనుక..నీ రాజకీయ భవిషత్తును చూసుకుంటున్నావ్,కానీ ఆ మాటల వెనుక ఉన్న అర్థం తెలియక.. ఆ వేడికి.. అనేక కుటుంబాలు..బలవుతున్నాయి. నీ మాటల వేడికి ఇప్పటి వరకు బలైన ప్రాణాల సంఖ్య ఎంతో తెలుసా? 1200 పైగా తెలంగాణ యువకులు ప్రాణాలు అర్పించారు.
ఇప్పటి వరకు నీవు గానీ, నీ రాజకీయ పార్టీ గానీ, ఆ కుటుంబాలను ఆదుకొనే సాహసం చెయ్యలేదు. ప్రజల సాక్షిగా,నడిరోడ్డుపై తెలంగాణ కోసం .. మంటల్లో దహనం అయిన శ్రీకాంత్ చారి కుటుంబానికి ఏ విధంగా సాయపడ్డావ్ కేసిఆర్ ఒక్కసారి ఆలోచించు? ఆ కుటుంబానికి శ్రీకాంత్ చారి లేని లోటు తీర్చాగలవా? నీవు నిజంగా తెలంగాణ రాష్ట్రం కోరుకునేవాడివైతే.. నీ దగ్గర ఉన్న ఆస్తిలో నుంచి.. కేవలం ఒక్క కోటి రూపాయాలు ఆ కుటుంబానికి నీవు నిజంగా ఇచ్చి ఉంటే.. ఈ రోజు తెలంగాణ ఉద్యమానికి నిజమైన నాయకుడిగా తెలంగాణ ప్రజలు చెప్పుకునేవారు. కానీ నీ స్వార్థ రాజకీయల కోసం తెలంగాణ విద్యార్థుల ప్రాణాలతో సాధించుకున్న తెలంగాణ ఉద్యమానికి నాయకుడిగా చెప్పుకుంటున్నావ్. కానీ నిజమైన నాయకులు తెలంగాణ ప్రజలే.
అందుకే తెలంగాణ ప్రజల్లో ఉన్న మేధావుల్లారా కలిసి మాట్లాడుకుందాం రండి? అని సమైక్యరాష్ట్రం కోరుకుంటున్న తెలుగు ప్రజలు పిలుస్తున్నారు. రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా? ఇరుప్రాంతాల ప్రజలు, మేథావులు, కవులు, కలిసి చర్చలు జరుపుకుంటే.. సమస్యకు పరిష్కారం దొరుకుతుందని.. తెలుగు ప్రజలు అంటున్నారు. ఇలాంటి సభలు వల్ల రెండు ప్రాంతాల ప్రజల మద్య ఉన్న వైషమ్యాలు తొలిపోతుందని మేథావులు అంటున్నారు. మన ఇంటి సమస్యను మనమే పరిష్కారించుకోవాలి. అప్పుడే తెలుగు ప్రజలు ఆనందంగా ఉంటారు. మన రాష్ట్రంలో.. అపారమైన మేధాస్సు కలిగిన మహానుబావులు చాలా మంది ఉన్నారు. కలిసి కూర్చోని మాట్లాడుకుంటే.. పోయేది ఏమీ లేదుగా అనే విషయం తెలుగు ప్రజలు తెలుసుకోవాలి. నువ్వా.. నేనా.. అని నిలబడి అరుసుకోవటం కంటే.. మనది అని కూర్చోని మాట్లాడుకుంటే.. సమస్యలకు పరిష్కారం దొరుకుంతుంది.. ఇద్దరి మద్య ఉన్న వైషమ్యం తొలిగిపోతుందని తెలుగు ప్రజలు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more