ఐటీ ఉద్యోగులు ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేస్తున్నారు.. కానీ, జీవితంలో ఫాదర్స్ కాలేకపోతున్నారు. ఐటీ ఉద్యోగులకు ఒకవైపు ఉన్న ఆనందమే అందరికి తెలుసు. రెండో వైపు జరుగుతున్న ప్రమాదం గురించి ఎవ్వరికి తెలియాదు.ఐటీ ఉద్యోగులు అంటే.. ఆదాయం ఎక్కువ, సుఖమైన జీవితం, ఎలాంటి ఇబ్బంది ఉండదని అందరు అనుకుంటారు. ఐటీ ఉద్యోగం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతకంటే భయంకరమైన నష్టం వారి జీవితానికి జరుగుతున్నందని కొంతమంది డాక్టర్లు అంటున్నారు. ఐటీ ఉద్యోగానికి, డాక్టర్లకు ఏమిటి సంబంధం? అనుకుంటున్నారా? అవును ఐటీ ఉద్యోగం చేసే వ్యక్తుల పై కొన్ని సర్వేలు చేసి, ఐటి ఉద్యోగుల కాల చక్రంలో జరుగుతున్న మార్పులను పసిగట్టింది డాక్టర్లే కాబట్టి. అమ్మాయిలు, అబ్బాయిలు , క్యాంపస్ జరిగిన ఇంటర్వ్యూలో సెలక్ట్ అవటం వెంటనే ఐటీ ఉద్యోగుల్లో చేరిపోవటం జరిగుతుంది. వేలల్లో జీతం పెరుగుతుంటుంది. కానీ వారి జీవితంలో మాత్రం కోట్ల సంఖ్యలో ఉన్న వీర్యకణాల సంఖ్య వేలల్లోకి పడిపోతుంది. ఈ విషయం తెలుసుకునేలోపే.. ప్రమాధస్థాయిలోకి చేరుకుంటున్నారు. 100 మంది పురుషుల్లో 40 శాతం మంది పురుషుల్లో ఈ లక్షణాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయని ప్రముఖ వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి 100 మంది పెళ్లైన దంపతుల్లో 15 జంటలు సంతానలేమీ సమస్యతో బాధపడుతున్నట్లు గైనకాలజిస్టు డాక్టర్లు గుర్తించారు.
ఐటీ ఉద్యోగులకు పగలు, నైట్ అనే తేడాల లేదు.. వారు కంప్యూటర్, ల్యాప్ టాప్ ల ముందు కూర్చూంటే మాత్రం అదే లోకంలో బతికేస్తారు. బిజీ జీవితంలో ఒత్తిడి పెరిగిపోవటంతో, పడకగదిలో చేసే వర్కు ను పక్కన పెట్టేస్తున్నారు. ఒక నెలలో ముద్దు ముచ్చటకు , మూడ్ దూరమైన జంటలు చాలా ఉన్నాయని ప్రముఖ డాక్టర్లు చెబుతున్నారు. వీరికి తోడు కాలుష్యం, నీటి కాలుష్యం , రసాయనికాలతో కూడిన ఆహారం తినటం వల్ల.. కొత్త పెళ్లైన జంటలను సంతాన లేమి సమస్య పట్టిపీడిస్తోంది. పెళ్లై పది సంవత్సరాలైన పిల్లలు పుట్టిని ఐటీ ఉద్యోగులు పిల్లలు కోసం సంతాన సాఫల్య కేంద్రాల చుట్టు తిరిగి వేల రూపాయాలు ఖర్చుపెడుతున్నారు. ఇలాంటీ వారి సంఖ్య రోజురోజుకు వేల సంఖ్యలో పెరిగిపోతోందని గైనకాలజిస్టు డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవల హైదాబాద్ లోని హెచ్ ఐసీసీలో జరిగిన ‘రీసెంట్ అడ్వాన్స్ ఇన్ అబ్ స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ’ అంతర్జాతీయ సదస్సుకు వచ్చిన గైనకాలజిస్టు డాక్టర్లు ఈ విషయాలను చెప్పటం జరిగింది. అయితే ఐటీ ఉద్యోగుల సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉందని వారు గైనకాలజీస్టు డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేయటం జరిగింది. కంపెనీ ప్రాజెక్టు పూర్తి చెయడం కోసం పగలు, రాత్రి అని తేడాలేకండా కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోని వర్క్ చెయడం, రాత్రిపూట వర్క్ చేసి పగలు నిద్రపోవటం, భార్యభర్తలు ఇద్దరు వేర్వేరు సమయాల్లో షిప్ట్ ఉద్యోగులు చేయటం, వలన వారిలోని మానసిక ప్రశాంతత లోపించి, వారి లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు. మగ, ఆడా ఎవరైన ఎక్కువు సేపు ల్యాప్ టాప్ ను ఒళ్లో పెట్టుకుని పనిచేయడం వల్ల వారి వీర్యకణాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని డాక్టర్లు అంటున్నారు. మహిళల్లో అండాల ఉత్పత్తి తగ్గిపోతోందని డాక్టర్ నర్మద సేత్ చెప్పారు.
మహిళలలో రుతుస్రావ సమయాల క్రమం తప్పుతోందని, నెలసరి పద్దతి ప్రకారం కాకపోవడం, కొన్ని సార్లు బ్లీడింగ్ ఎక్కువ కావడం, అండోత్పత్తి తగ్గడం వంటి సమస్యలు అమ్మాయిలకు ఎక్కువుగా వస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. అలాగే చక్కెరను తెల్లగా మార్చడానికి ఉపయోగించే రసాయనాల వల్ల మగ వారిలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతోందని డాక్టర్ అరుల్ కుమార్ వివరించారు. ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది.. 30 దాటిన తరువాతనే పెళ్లి చేసుకుంటున్నారు. అంతేకాకుండా జీవితంలో స్థిరపడిన తరువాత పెళ్లి చేసుకుందాం అని 40 దాటిన తరువాత పెళ్లి చేసుకున్న వారిలో కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువుగా కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more