ఏపి ఎన్జీవో భవన్ లో మాట్లాడిన ఆ సంఘ అధ్యక్షుడు అశోక్ బాబు, తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడి చేస్తూ, 16 న హైకోర్టు తీర్పు వెలివడవచ్చునని, తీర్పు ఎలా ఉన్నాసరే దానితో నిమిత్తం లేకుండా సమ్మె మాత్రం కొనసాగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న కోరికతోనే సమ్మె సాగుతుందని ఆయన అన్నారు.
గ్రామ స్థాయిలో చైతన్య సభలు 14 వ తేదీ వరకు జరుగుతాయని, ఇంతవరకు విజయవంతంగా సాగాయని, 15 న రాష్ట్ర స్థాయిలో ఎపిఎన్జీవో కార్యవర్గ సమావేశం, 16న ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలతో కలిసి చర్చలు కొనసాగిస్తామని అశోక్ బాబు చెప్పారు.
ఒత్తిడి మంత్రాలలో, కేంద్ర మంత్రులు ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి తేవాలి, తెలంగాణా బిల్లు అసెంబ్లీకి వస్తే ఎమ్మెల్యేల మీద ఎలాంటి ఒత్తిడి తేవాలన్న విషయాలమీద చర్చలు జరుపుతున్నామని అశోక్ బాబు అన్నారు. రేపటి కార్యక్రమంలో సీమాంధ్రలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం ఉందని కూడా ఆయన తెలియజేసారు.
అయితే, ఉద్యోగులే ప్రభుత్వాన్ని నడుపుతారా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారాలకు అతీతంగా నాయకత్వం వహించి ప్రజలచేత ఎన్నుకోబడి ప్రజాప్రాతినిధ్యం చేసేవారిని కాదని, ఉద్యోగులు తమ విధులు బహిష్కరించి ప్రభుత్వ కార్యకలాపాల్లో తలదూర్చటం ఎంతవరకు సమంజసం అని పలువురు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సరైన నాయకత్వం లేనప్పుడు ఉద్యోగుల చేత పనులు చేయించుకోవటానికి సామాన్య ప్రజలు ఎన్ని కష్టాలననుభవిస్తుంటారో ఎవరూ మర్చిపోరని కూడా వారు అన్నారు. కానీ, ఉద్యమాలలో ఎవరో ఒకరు ముందడుగు వెయ్యటం కూడా అవసరమేనన్న అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తపరచారు.
ఎపిఎన్జీవోల ప్రజాప్రయోజన వ్యాజ్యం మీద 16 కి హైకోర్టు తీర్పువస్తుందని దాన్నిబట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని అశోక్ బాబు చెప్పారు. .
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more