అమ్మ కోసం కోడుకు, కొడుకు కోసం తల్లి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో ఎవ్వరికి అర్థం కావటంలేదు. గత వారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ విజయమ్మ సమైక్యాంద్రకు మద్దతుగా గుంటూరుల్లో ఆమరణ నిరాహర దీక్ష మొదలుపెట్టిన విషయం తెలిసిందే. వైఎస్ విజయమ్మ దీక్షను అయిదు రోజుల పాటు కొనసాగించింది. ఆరోవ రోజు అర్థరాత్రి సమయంలో వైఎస్ విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేసి, ఆస్పత్రికి చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో.. వైఎస్ విజయమ్మ ఆసుపత్రిలోనే నిరాహారా దీక్ష చెయ్యటానికి సిద్దమైంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్న సమయంలో, చంచల్ గూడ జైల్లో ఉన్న జగన్ చేత ఫోన్ ద్వారా మాట్లాడించి.. వైఎస్ విజయమ్మ చేత దీక్ష విరమింప చేశారు. అయితే ఇప్పుడ అదే పరిస్థితి వచ్చింది. అప్పుడు జగన్ ఫోన్ చేస్తే.. విజయమ్మ దీక్ష విరమించింది. ఇప్పడు విజయమ్మ లేటర్ రాసి ఇస్తే జగన్ దీక్ష విరమిస్తారా? అనే ప్రశ్న అందరిని వేధిస్తుంది. జగన్ దీక్ష ఎందుకు విరమించాలి? అనే విషయం విజయమ్మ ఖచ్చితమైన సమాధానం చెప్పటంలేదు. కానీ జగన్ కొద్దిసేపట్లో దీక్ష విరమిస్తాడు అని మీడియా లో వార్తలు వస్తున్నాయి. సమైక్యాంద్రకు మద్దతుగా చేస్తున్న దీక్ష ఇంత సడన్ గా విరమిస్తారా? ఎవరి కోసం దీక్ష విరిమిస్తున్నారు? అనే విషయం పై ఎవరి వద్ద క్లారిటీ లేదు. జగన్ను కలిసే పరిస్థితి లేనందునా... పార్టీ చేసిన తీర్మానాన్ని, ఓ లేఖను పంపిస్తామని విజయమ్మ వెల్లడించారు. జగన్కు అటెండర్గా ఉండేందుకు తననుగాని, భారతిని గాని అనుమతించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసినట్టు ఆమె తెలిపారు. కోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎవరూ తొందరపడి ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని బాధతో కూడిన స్వరంతో విజయమ్మ విజ్ఞప్తి చేశారు. కాగా జగన్ దీక్ష, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సమావేశం అయ్యింది. జగన్ తక్షణమే దీక్ష విరమించాలని పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అనంతరం విజయమ్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో అలిపిరి సంఘటన తర్వాత హింసను నిరసిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి దీక్ష చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితి బాధ కలిగిస్తుందని విజయమ్మ అన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకున్న నిర్ణయం పై సీమాంద్ర ప్రజలు ఏకీభవించటంలేదు. వైఎస్ విజయమ్మపై ఎవరైన ఒత్తిడి పెంచారా? ఆమెలో కలిగిన ఆందోళనలకు అనేక అనుమానాలు వస్తున్నాయి. తల్లి కోరిక మేరకు వైఎస్ జగన్ మరి కొద్ది సేపట్లో దీక్ష విరమించటానికి సిద్దంగా ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more