Antony committee will starts work

seemandhra people agitation, digvijaysingh aicc secretary, digvijay singh statement, antony committee

seemandhra people agitation, digvijaysingh aicc secretary, digvijay singh statement, antony committee

కమిటీ పని ప్రారంభించింది ?

Posted: 08/14/2013 10:00 AM IST
Antony committee will starts work

కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని విభజిస్తూ, తెలంగాణ ఏర్పాటు పై ప్రకటన చేయడంతో సీమాంద్ర కాంగ్రెస్ లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సీమాంధ్రుల సమస్యలను వినడానికి ఆంటోనీ కమిటీ ని కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ విభజన పై వ్యక్తం అవుతున్న భిన్నాభిప్రాయాలను పరిష్కరిస్తుంది.  సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ఆందోళనలను పరిశీలించేందుకు అధిష్ఠానం నియమించిన ఆంటోనీ కమిటీ తన పని ప్రారంభించింది. కాంగ్రెస్ వార్ రూమ్‌లో మంగళవారం రాత్రి సుమారు గంటసేపు భేటీ అయింది. విధి విధానాల పై కమిటీ సభ్యులు వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ తో పాటు ఏఐసీసీ సభ్యుల తో కూడా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యాడు. సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం దిగ్విజయ్ సింగ్ మీడియా తో మాట్లడారు.  వచ్చే రెండు మూడు రోజుల్లో కేంద్ర మంత్రులు , ఎంపీలతో సమావేశం కాబోతున్నట్లు చెప్పారు. ఆంటోనీ కమిటీకి అన్ని ప్రాంతాల వారు, ఎన్జీవోలు, విద్యార్థులు తమ అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున కమిటీ హైదరాబాద్ వెళ్లడం సాధ్యం కాదన్నారు.

తెలంగాణపై ఏకాభిప్రాయానికి వచ్చేందుకు ప్రయత్నిస్తామని, త్వరలో అన్ని సందేహాలనూ నివృత్తి చేస్తామని చెప్పారు. పార్లమెంట్‌లో ముసాయిదా బిల్లు చర్చకు వచ్చినప్పుడు ఉభయ ప్రాంతాల వారూ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను చెప్పవచ్చునని తెలిపారు. ఆంటోనీ కమిటీని కలుసుకోవాలనుకునేవారు తమ వివరాలను పీసీసీ చీఫ్ బొత్సకు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలనూ సంప్రదించాక వారి నుంచి 100 శాతం ఏకాభిప్రాయం వ్యక్తమయ్యాకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకున్నామని దిగ్విజయ్ చెప్పారు. .విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతికి సమాచారం పంపుతుందని, రాష్ట్రపతి ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపిస్తారని ఇదే జరుగుతుందని ఆయన అన్నారు.అంటే దీనర్ధం తెలంగాణపై శాసనసభలో తీర్మానం అవసరం లేదన్న సంకేతాన్ని ఆయన ఇచ్చారు. ఆంటోని కమిటీ కేవలం సీంమాంద్రులను చల్లబర్చడానికే అని వాదన వినిపిస్తుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more