తెలంగాణలో తెల్లవారుజామున కోడి కూసింది. సూర్యుడు ఎప్పటిలాగే.. చీకటి కోణాలను చీల్చుకుంటూ వెలుగులు విరజిమ్ముతు బయటకు వస్తున్నారు. ప్రక్రుతి మాత్రం కొత్త వెలుగులకు ఆహ్వనం పలికింది. కానీ తెలంగాణ ప్రజలు అరవై సంవత్సరల నాటి కల నేరవేరిన రోజు మాత్రం ఇందుకు విరుద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యామలు, ఎంతో మంది పౌరులు బలిదానమైనారు. కానీ ఆ తెలంగాణ ఏర్పాటు జరిగిన తరువాత మాత్రం తెలంగాణ లో ఎక్కడ ఆనందం, ఉత్సాహం కనబడలేదు. తెలంగాణ కోసం పోరు బాట పట్టిన పల్లెలు సైతం ఎలాంటి ఆర్బాటాలు కనిపించలేదు. తెలంగాణను సాధించం అన్న విజయం కాంతులు తెలంగాణ ప్రజల ముఖాల మీద కనబడలేదు. తెలంగాణ వచ్చింది అనే ఆనందం కంటే.. ఏదో కోల్పోయం అనే బాధ తెలంగాణ ప్రజల ముఖాల మీద కనబడుతుందని మీడియా వర్గాలు అంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని కేంద్ర ప్రకటించిన కొన్ని గంటల తరువాత కూడా .. తెలంగాణలో ఎక్కడ ఆనందచ్చాయాలు కనిపించలేదు.
అయితే సీమాంద్ర లో మాత్రం సమైక్యాంద్ర ఉద్యమం ఊపందుకుంది. విభజనాగ్రహంతో ప్రజలు ఊగిపోతున్నారు. సమైక్యాంద్ర సెగ ఏమిటో ఢిల్లీ పెద్దలను తాకింది. రాష్ట్రం మొత్తం అతలకుతలమైపోతుంది. రాష్ట్ర విభజన పై నిరసనగా సీమాంద్ర నిరసనకారులు ఆందోళన, ఉద్యామలు చేపట్టారు. ఆ సెగ హైదరాబాద్ నగరాన్ని సైతం తాకింది. అయితే కొత్త రాష్ట్రం ఏర్పాడినందుకు, తెలంగాణ ప్రాంత ప్రజల్లో గానీ, రాజకీయ నాయకుల్లో గానీ ఉత్సహమే కనబడటం లేదు. తెలంగాణ ప్రాంతం అంత స్మశాన వైర్యాగంతో బాధపడుతున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనపై సీమాంద్ర నాయకులు, ప్రజలు చేస్తున్న నిరసనలు, ఉద్యమం సెగలు చూసిన తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంత మేథావులు, రాజకీయ నాయకులు , అసలు ఎందుకు విడిపోవాలి? కలిసుంటే నష్టం ఏమిటి? ఇప్పటి వరకు కలిసి ఉన్నందువల లాభామే జరిగింది గానీ ఎవ్వరికి నష్టం జరగలేదు. అలాంటప్పుడు తెలుగు ప్రజలు రెండు ముక్కలు ఎందుకు విడిపోవాలనే వైరాగ్యంతో బాధపడుతున్నారు. ఒక వేళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాడితే.. ఏం జరుగుతుంది. ఏదో అది కొద్ది మంది ఉద్యోగులు వస్తాయి అంతే తప్ప పెద్దగా లాభం లేదని తెలంగాణ ప్రజలు అంటున్నారు.
ఇటీవల కేసిఆర్ చేసిన ఆంద్రవాళ్లు వెళ్లిపోవాలి అనే కామెంట్ తో తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్ర ప్రజలు వెళ్లిపోతే.. జరిగే నష్టం ఊహించుకోని తెలంగాణ ప్రాంత నాయకులు, ప్రజలు, వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ఏ ప్రాంతానికి వెళ్లిన ఆంద్రవాళ్లు కనిపిస్తారు. ఇక నుండి ఆంద్ర వాళ్లు తెలంగాణలో కనిపించకపోతే.. తెలంగాణ ప్రాంతం అంత ఒక్కసారిగా స్తంభించి పోతుందని తెలంగాణ మేథావులు సంఘం అంటుంది. అందుకు చిన్న ఉదాహారణ ఆంద్రవాళ్ల పండగైన సంక్రాంతి వచ్చిందంటే తెలంగాణ ప్రాంతం నుండి కొన్ని లక్షల మంది సీమాంద్ర ప్రాంతలకు వెళ్లటం జరుగుతుంది. ఆ వెళ్లిన సందర్బంలో .. తెలంగాణ ప్రాంతం రోడ్డులన్నీ నిర్మాణుషంగా మారిపోతాయి. ఆ సమయంలో తెలంగాణ లో జరిగి బిజినేస్ ఒక్కసారిగా నేలను తాకుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇలాంటి విషయాలను ఊహించుకుంటే తెలంగాణ ప్రజల ముఖంలో వైరాగ్యం కనిపిస్తుంది. రాజకీయ నాయకులు ఓట్లు కోసం తెలుగు ప్రజలు విడిగొట్టి పాలించటం పై తెలుగు ప్రజలు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రజలకు కొత్త రాష్ట్రం ఏర్పాటు అవుతుందనే ఆనందం వారిలో లేదని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి.
ఇన్నాళ్లు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవించాం.. ఓ ప్రాంతంలో ఉద్యమం కారణంగా ఇంకో ప్రాంతం ఇబ్బంది పడుతోందన్న ఆలోచన ఇరు ప్రాంతాలకు చెందిన నేతల్లోనూ ఇన్నాళ్లూ లేకపోవడమే ఇలా జరిగిందని రాజకీయ మేథావులు అంటున్నారు. ఇంకెన్నాళ్లు ఈ రాజకీయ మంటలిలా రాష్ట్రాన్ని తగలబెడ్తాయోగానీ.. ఇప్పటికైనా ఇరు ప్రాంతాలకు చెందిన నేతలు ఓ చోట కూర్చుని, సమస్యకు పరిష్కారాన్ని వెతికితే మంచిది. రాజకీయ నాయకులూ.. కాస్తంత రాజకీయాల్ని పక్కన పెట్టండి .. తెలుగు ప్రజలు భవిష్యత్తు గురించి ఆలోచించండి?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more