నిన్నటి వరకు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, ఆ పార్టీ డీఎన్ ఏ మాదే, వెన్నుపోటు పార్టీ, అవినీతి పార్టీ, కుంభకోణాల పార్టీ, అంటూ ..ఒక పార్టీ పై మరో పార్టీ నాయకులు స్టేజీల మీద మైకులు పట్టుకోని, తిట్ల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ నుండి పుట్టిన పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు వచ్చింది. అలాగే కుంభకోణాల పార్టీగా కాంగ్రెస్ ఉన్న విషయం తెలిసిందే. అయితే వెన్నుపోటు దారుల పార్టీ అంటూ.. తెలుగుదేశం పార్టీ పై విమర్శలు దంచిన రాజకీయ పార్టీలో ఇప్పుడు తెరవెనుక రహస్యం మంతనాలు జరుగుతున్నాయి. గ్రామల్లో ఉమ్మడి పోరు చేస్తున్నాయి. ఈ మూడు పార్టీ ల నాయకులు స్నేహ బంధంతో గ్రామ పంచాయితీలను పంచుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కలిసి .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై పోరుకు సిద్దమైంది కొన్నిచోట్ల . మరికొన్ని చోట్ల .. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి తెలుగుదేశం మీద పోటీ చేస్తున్నాయి. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టిడిపి కలిసి టీఆర్ఎస్ మీద పోటీ చేస్తున్నాయి. ఇలా రాష్ట్రం నిండా ఈ ముగ్గురు నాయకులు స్నేహ బంధం పెంచుకుంటున్నారు. అసలు ఈ ముగ్గురు మధ్య మైత్రి ఎలా కుదురుతుందో ప్రజలకు అర్థం కావటంలేదు. ‘‘పగలైతే పబ్లిక్ లో చీగపాట్లు .. రాత్రైతే చీకటి కౌగిలింతలు’ ఇలా ఈ ముగ్గురి రాజకీయం ఉందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నారో, ఎవరు ఎవరికి స్నేహ హస్తం ఇస్తున్నారో ఎవరికి అర్థం కావటంలేదని .. ఆయ పార్టీల సీనియర్ నాయకులు తలబాధుకుంటున్నారు.
వీరి రాజకీయాలతో రాష్ట్రం పరిస్థితుల రాజకీయాన్ని మార్చేస్తున్నాయి. వైఎస్ మరణానంతరం భిన్న వాతావరణం ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టుకతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. అధికారానికి దాదాపు దశాబ్దం పాటు దూరంగా ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహాం, నిస్సహాయత కనిపిస్తోంది. ఇదే పంచాయతీ ఎన్నికలలో స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిచోట్ల కనీసం అభ్యర్థులను కూడా బరిలోకి దింపలేక కాంగ్రెస్ అభ్యర్థులనే లోపాయికారిగా బలపరుస్తోంది. చంద్రబాబు నాయుడు సొంత మండలం చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. అభ్యర్థులను ఎంపిక చేయడంలో చతికిల బడిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు మద్దతివ్వడంతోనే సరిపెట్టుకుంది. కొన్ని చోట్ల నామ మాత్ర పంచాయతీలలో కాంగ్రెస్ నుంచి మద్దతు పొందుతూ అధిక పంచాయతీలలో కాంగ్రెస్ ముంగిట సాగిలాపడింది. టిడిపి అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతిస్తోంది. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు ఉమ్మడి ప్రత్యర్థిగా పరిగణిస్తున్నాయి.
రెండు పార్టీలు ఏకమై పని చేస్తున్నాయి. తెలుగుదేశం ప్రభావం అధికంగా ఉన్న చోట్ల ఆ పార్టీ ఏకగ్రీవం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా గ్రామాలను పంచుకోవటంతో .. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ ల మద్య ఉన్న ఫ్రెండ్ షిఫ్ ఏమిటో అందరికి అర్థమవుతుంది. ఈ మైత్రి సంబంధంతో కొన్ని గ్రామల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ పదవి ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి అధిక సంఖ్యలో గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండి. మూడో స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని ఎన్నికల కమిషనర్ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more