పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బాధ్యతలు చేపట్టిన తరువాత మహిళలకు రక్షణలేకుండా పోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా పశ్చిమబెంగాల్లోనే మహిళలపై వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలకు నిరసనగా మహిళా సంఘాలు ఈనెల 21న కోల్కతాలో పెద్ద ర్యాలీ నిర్వహించాయి. ఇదే సమయంలో ముఖ్య మంత్రి మమత మరోచోట పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ పంచాయితీలలో మహిళలకు 50 శాతం రిజర్వే షన్లు కల్పించామని ప్రకటించడం విశేషం. మమత బరాసత్ జిల్లాలోని కామ్ధుని గ్రామంలో ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచారానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతోంది. బాధితురాలి కుంటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి మమత కామ్ధుని గ్రామం సందర్శించగా మహిళలందరూ ఆమెను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. మమతను మాట్లాడనీయలేదు. దాంతో ఆగ్రహించిన మమత 'నోరుమూయండి' అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 'నేనంతా విన్నాను. ఎక్కువ మాట్లాడకుండా నోరుమూయండి' అంటూ దీదీ కళ్ళెర్రచేయడంతో మహిళలు అవాక్కయ్యారు.
తమ గ్రామంలోని మద్యం దుకాణాన్ని మూసివేయించాలని, రోడ్లను బాగుచేయించాలని కోరడమే కామ్ధుని గ్రామస్థులు చేసిన పాపం. ఈ సంఘటన జరిగిన రెండు రోజులకు మమత మీడియాతో మాట్లాడుతూ టెలివిజన్ ఛానళ్ళలో జరుగుతున్న చర్చల్లో తల్లులు, సోదరీమణులను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే మహిళా ముఖ్యమంత్రిగా మమత మరింత సంయమనంతో వ్యవహరించాలని, రాష్ట్ర ప్రభుత్వాధినేతగా మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆమెకు ఉందని సినీ దర్శకురాలు అపర్ణ సేన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిననాటికి, ఇప్పటికి మమత వ్యవహార శైలిలో మార్పువచ్చిందని అపర్ణ సేన్ వ్యక్తంచేసిన అభిప్రాయాలతో మహిళా సంఘాల నేతలు అంగీకరిస్తున్నారు.
2006లో సింగూరు ఆందోళన సందర్భంగా 16 ఏళ్ళ తాప్సి మాలిక్పై దుండగులు అత్యాచారం జరిపి హత్యచేసిన సంఘటనపై మమత పెద్ద ఎత్తున ఆదోళన చేపట్టారు. నిజానికి ఆ సంఘటనే మమతకు అధికారం కట్టబెట్టిందని, మమత తమకు రక్షణ కల్పిస్తారన్న విశ్వాసంతో మహిళలు ఆమెకు పట్టం కట్టారని అంజలి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు రత్నాబోలీ రే అభిప్రాయపడ్డారు. బిరాతీలో ముగ్గురు బంగ్లాదేశ్ మహిళలపై అత్యాచారం జరగ్గా, బటాలాలో సీపీయం కార్యాలయం సమీపంలో మహిళా హక్కుల ఉద్యమనేతలపై దాడిచేసి వారిని హత్యచేశారు. అయితే, తాజా సంఘటనలో 'అందరు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయా?' అంటూ మమత ఓ ర్యాలీలో ప్రశ్నించడం వివాదాస్పదమైంది. పరిపాలనలో జరుగుతున్న లోపాలపై వస్తున్న విమర్శలను మమత వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని, ఇది మంచి సంప్రదాయంకాదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళా హక్కులపై ఉద్యమిస్తున్న నేతలు కూడా మమత వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. ఓ మహిళా ముఖ్యమంత్రి పాలనలో స్త్రీలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోవడం విచారకరమన్న వ్యాఖ్యలు వినిపి స్తున్నాయి. మమతా బెనర్జీ శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టి సారించడం మంచిదని ఆమె సన్నిహితులు సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more