ఇప్పటికే రాజకీయ హోదా కోసం నందమూరి కుటుంబ సభ్యులు మద్య విభేదాలతో రోడ్డు పడ్డ విషయం తెలిసిందే. అదే బాటలో.. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు కూడా రాజకీయ హోదా కోసం పోరు సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైయస్ జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆయన సోదరి షర్మిలకు, సతీమణి వైయస్ భారతికి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందనే ప్రచారం ముమ్మరంగానే సాగుతోంది. వైయస్ జగన్ జైలులో ఉన్న స్థితిలో పార్టీలో ఆ తర్వాతి స్థాన కోసం ఇరువురి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. పాదయాత్ర ద్వారా పార్టీపై పట్టు సాధించేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని, జగన్ తర్వాతి స్థానం ఆక్రమించాలని చూస్తున్నారని, కడప పార్లమెంటు సీటు కోసం పట్టుబడుతున్నారని, దానికి అంగీకరిస్తేనే పాదయాత్ర చేస్తానని షర్మిల చెప్పినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అయితే, అందులో ఏ మాత్రం నిజం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. షర్మిల పట్ల తనకు ఏ విధమైన వ్యతిరేకత లేదని వైయస్ భారతి చెబుతున్నారట.
తన భర్త కోసం వందలాది కిలోమీటర్లు నడవడానికి సిద్ధపడిన షర్మిల రుణం తీర్చుకోవడం కూడా తన వల్ల కాదని, ఎట్టి పరిస్థితిలోనూ షర్మిలను వ్యతిరేకించే పరిస్థితి ఉండదని, పైగా ఆమెకు రుణపడి ఉంటానని భారతి అంటున్నట్లు చెబుతున్నారు. ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగింది. . తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను ఎదుర్కుని వచ్చే ఎన్నికల్లో పార్టీకి విజయం చేకూర్చి పెట్టడమే తమ బాధ్యతగా కుటుంబ సభ్యులంతా అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పుకార్లు సహజంగా పుడతాయని వైసీపీ నాయకులు అంటున్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాత్రం మా కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పినట్లు సమాచారం. రాష్ట్రం ప్రజలకు రాజన్న పరిపాలన అందించాలనే మా ద్యేయమని విజమమ్మ అంటుందని వైసీపీ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more