జగన్ అక్రమాస్తుల కేసులో నిన్న మంత్రి మోపిదేవి వెంకటరమణకు జైలు జీవితంలో ఒక సంవత్సరం నిండింది. ఇప్పుడు అదే బాటలో అక్రమాస్తుల కేసులో చంచల్గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేటితో ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది మే 27న కోర్టు ఆదేశాల మేరకు జగన్ను విచారణ నిమిత్తం చంచల్గుడా జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కాలంలో జగన్ రెండు పర్యాయాలు కోర్టుకు హాజరయ్యారు. ఏడాది కాలంగా జగన్ జైలులోనే ఉన్నా, అక్కడి నుంచే ఆయన పార్టీ నాయకులకు ఆదేశాలు పంపిస్తున్నారు. జగన్ అంతరంగిక కార్యదర్శి (పిఎ) కె. నాగేశ్వర రెడ్డి (కెఎన్ఆర్) ఉదయం నుంచి సాయంత్రం వరకు జైలు సందర్శకుల గది వద్దే ఉంటారు.
ఆయన ద్వారా జగన్ తన ఆదేశాలను, ఇతరత్రా సమాచారాన్ని పార్టీ నాయకులకు చేరవేస్తుంటారు. అంతేకాకుండా వారంలో మూడు రోజులు పార్టీ ముఖ్య నాయకులు సోమయాజులు, వైవి సుబ్బారెడ్డి ప్రభృతులు జగన్ను కలుసుకుంటున్నారు. లోక్సభ, అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, ఏయే స్థానాల్లో ఏ పార్టీ బలంగా ఉంది తదితర అంశాలపై కసరత్తు చేసుకోవడానికి సమయం లభించింది. పార్టీ ముఖ్య నాయకులు తనను కలిసినప్పుడు ఈ అంశాలపైనే (సందర్శకుల గదిలో) జగన్ చర్చిస్తున్నారు. అప్పుడప్పుడు జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణ భారతి ఆయన్ను కలుసుకుంటున్నారు. ముఖ్యంగా ములాఖత్లతో సందడిగా మారింది.
జగన్ను కలిసేందుకు వస్తున్న పార్టీ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకు తరచూ అవకాశం కల్పిస్తున్నారని, జైలు వైకాపా కార్యాలయంగా మారిందన్న విమర్శలూ ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తాయి. జగన్ను కలిసేందుకు వచ్చే వారికి అవకాశం కల్పిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో చంచల్గూడ జైలు ఒకరిద్దరు అధికారులను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకునే ముఖ్య నాయకులకు జగన్ అప్పాయింట్మెంట్ ఇస్తారు. తొలుత పార్టీ ముఖ్య నాయకులు సోమయాజులు లేదా వైవి సుబ్బారెడ్డి వారితో చర్చించి, అవసరం అనుకుంటే వారిని జైలులో జగన్ కలిసేందుకు ఏర్పాట్లు చేస్తారు. దీనికి జగన్ పిఎ కెఎన్ఆర్ రంగం సిద్ధం చేస్తారు.
ఏడాది కాలంగా జగన్ జైలులో ఉండడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన కనిపిస్తున్నది. జగన్ రాక కోసం వారు ఎదురు చూస్తున్నారు. జగన్ కేసును కోర్టు నాలుగు నెలలకు వాయిదా వేసింది. అయితే పార్టీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహ తలెత్తకుండా ఉండేందుకు జగన్ సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టారు. అమె పాదయాత్ర ఇప్పటికే 160 రోజులకు చేరింది. మరోవైపు జగన్ తల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా అప్పుడప్పుడు రచ్చబండ నిర్వహిస్తున్నారు. ఏదో రకంగా ప్రజల్లో ఉంటున్నారు.
జగన్ బెయిల్పై విడుదలైతే వెంటనే ఓదార్పు యాత్ర చేపడతారు. అయితే సార్వత్రిక ఎన్నికలలోగా వస్తారా? లేదా? అని పార్టీలో నాయకులు ఆందోళనగా ఉన్నారు. జగన్ తప్పకుండా బయటకు వస్తారని, ఒకవేళ బయటకు రాకపోయినా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని విజయమ్మ ఇటీవల తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more